amp pages | Sakshi

27 నుంచి మండలి సమావేశాలు 

Published on Sat, 09/22/2018 - 02:35

సాక్షి, హైదరాబాద్‌: శాసన మండలి సమావేశాలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాల నిర్వహణపై శాసనసభ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే గురువారం ఉదయం 11 గంటలకు  సమావేశం ప్రారంభం కానుందని.. సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకు సమాచారమిచ్చారు.  శాసనసభ రద్దయిన నేపథ్యంలో శాసనమండలి సమావేశాలు మాత్రమే జరుగుతున్నాయి. శాసనసభ, శాసనమండలి సమావేశాలు చివరిసారిగా మార్చి 29న జరిగాయి. ఆరునెలల్లోపు కచ్చితంగా సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ షెడ్యూల్‌ ఖరారైంది.  

27న స్పష్టత..: శాసనసభ రద్దయి.. శాసనమండలి సమావేశాలు మాత్రం జరుగుతుండటం అరుదైన అంశంగా చెప్పవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని సీనియర్‌ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. శాసన మండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహిస్తారనేది ఈ నెల 27న స్పష్టత రానుంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న మండలి సమావేశాల నిర్వహణపై ఆసక్తి నెలకొంది. 

ప్రచారానికి వారం విరామం... 
మండలి సమావేశాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మరో వారం వాయిదా పడనున్నాయి. సెప్టెంబర్‌ 7న హుస్నాబాద్‌లో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఎన్నికలు ప్రచారాన్ని ప్రారంభించారు. 50 రోజుల్లో వంద బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి ముందుగా హైదరాబాద్‌ మినహా అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచార బహిరంగసభల నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ నెల 25 తర్వాత వరుసగా సభలను నిర్వహించాలనుకున్నారు. మండలి సమావేశాలున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ మరో వారం వాయిదా పడనుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)