Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'బీజేపీ సభ్యత్వం బలుపు కాదు వాపు'
Published on Wed, 04/01/2015 - 14:30
హైదరాబాద్: బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పోరాటాలు చేస్తామని సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. అలాగే బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మే 14న దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. బుధవారం హైదరాబాద్లో ఆ పార్టీ నేతలు నారాయణ, చాడ వెంకటరెడ్డితో కలసి సురవరం సుధాకరరెడ్డి మాట్లాడారు.
బీజేపీ సభ్యత్వం బలుపు కాదు వాపు అంటూ సుధాకరరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు మతోన్మాదం రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలకు పన్ను విధించడం వివాదాస్పద నిర్ణయమని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఇది ఏకపక్షం అంటూ కేసీఆర్ ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు.
#
Tags