amp pages | Sakshi

మహిళల పేరిటే పట్టాలు

Published on Sun, 07/27/2014 - 03:05

దళితులకు భూపంపిణీపై జీవో జారీ
అత్యంత నిరుపేదలకు తొలి విడత భూమి
మార్గదర్శకాలపై త్వరలో ఉత్తర్వులు!    
సాక్షి, హైదరాబాద్: భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ భూమికి మహిళల పేరిటే పట్టాలను ఇవ్వనుంది. అలాగే ఏడాదిపాటు సాగుకు అవసరమైన ప్యాకేజీని కూడా అందించనుంది. ఈ మేరకు శనివారం ఎస్సీ అభివృద్ధిశాఖ జీవో జారీ చేసింది. దళితులు గౌరవంగా బతికే అవకాశం కల్పించేందుకు.. భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి భూమి కొనుగోలు, పంపిణీ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం.. వ్యవసాయాధారిత దళిత కుటుంబాల అభివృద్ధికి గతంలో ఉన్న విధానాల్లో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం 2014-15లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద దళిత నిరుపేదలకు భూమిని కొనుగోలు చేసి పంపిణీ చేస్తారు.

ఇందులో అసలే భూమిలేని దళిత కుటుంబాలకు మొదటి విడతలో ప్రాధాన్యం ఇస్తారు. అర ఎకరం, ఎకరం భూమి ఉన్న పేద దళిత రైతులకు మిగతా భూమిని అందించి, మూడెకరాల రైతులుగా మార్చడాన్ని రెండో విడతలో చేపడతారు. మూడెకరాలు ఒకే చోట అందిస్తారు. ఇప్పటికే దళిత కుటుంబాలకు అసైన్ చేసిన భూములకు కూడా ఈ కార్యక్రమాన్ని వర్తింపచేస్తారు. రికార్డుల ఆధారంగా భూమిలేని దళితులెవరో..? జిల్లా కలెక్టర్లు గుర్తిస్తారు. భూముల రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ వంటి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది.

భూమి అభివృద్ధికి, నర్సరీలకు, వ్యవసాయ పరికరాలకు సహాయాన్ని అందించడంతో పాటు ఒక పంట కాలానికి అవసరమైన నీటి వసతి, డ్రిప్ సౌకర్యం, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు, పంపుసెట్లు, విద్యుదీకరణ తదితర సదుపాయాలన్నీ ప్రభుత్వమే సమకూరుస్తుంది. వ్యవసాయ వ్యయానికి సంబంధించిన మొత్తాన్ని నేరుగా లబ్ధిదారు ఖాతాకే జమ చేస్తారు. ఈ కార్యక్రమం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను విడిగా జారీ చేయనున్నారు.

Videos

వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?