ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'వచ్చే ఏడాది ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు'
Published on Sat, 08/01/2015 - 17:01
హన్మకొండ (వరంగల్ జిల్లా) : రానున్న ఏడాదిలో ముస్లిం, గిరిజనులకు 12శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా బిల్లును తీసుకోస్తామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం వరంగల్ జిల్లా హన్మకొండలోని జాకరీయా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈవిధంగా వ్యాఖ్యానించారు.
మసీదుల్లో పని చేసే ఇమామ్లకు గౌరవ వేతనంగా రూ. 2వేల చెక్కులను ఇచ్చేందుకు మంత్రి వరంగల్ చేరుకున్నారు. కాగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప దినాల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇమామ్లు తమ బ్యాంకు ఖాతా నంబర్లును ఇస్తే ప్రతి నెలా నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తామని చెప్పారు.
#
Tags