amp pages | Sakshi

28న ఆర్డీఎస్ పై కర్ణాటకతో చర్చలు

Published on Sun, 04/24/2016 - 04:21

బెంగళూరు వెళ్లనున్న మంత్రి హరీశ్‌రావు

 సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్)పై నెలకొన్న అనిశ్చితికి తెరదించేం దుకు ఎగువ రాష్ట్రమైన కర్ణాటకతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డీఎస్‌పై చర్చించేందుకు ఈ నెల 28న బెంగళూరుకు రావాల్సిందిగా కర్ణాటక నీటిపారుదలశాఖ మంత్రి ఎం.బి. పాటిల్...రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును శనివారం ఆహ్వానించారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నడుమ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ఉన్న ఆర్డీఎస్ వివిధ కారణాలతో తెలంగాణ ప్రాంత ఆయకట్టు రైతులకు నీరు అందించలేకపోతున్న వైనాన్ని హరీశ్‌రావు శనివారం ఫోన్లో పాటిల్‌తో చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్డీఎస్ పనులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు.

కృష్ణా ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం 15.9 టీఎంసీల ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు నీరు అందాల్సి ఉండగా 5-6 టీఎంసీలకు మించి రావడం లేదని...ఫలితంగా నిర్దేశిత ఆయకట్టులో కనీసం 20 వేల ఎకరాలు కూడా సాగుకు నోచుకోవడం లేదన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రైతులు తరచూ తూములు పగలగొట్టడం, నీటిని అక్రమంగా తరలించుకుపోవడం వంటి చర్యలతో ఆర్డీఎస్ ద్వారా తెలంగాణలో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదన్నారు.

ఆర్డీఎస్ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తును 15 సెంటీమీటర్ల మేర పెంచేందుకు, లైనింగ్ మరమ్మతులకు ఉమ్మడి రాష్టంలో రూ. 72 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని హరీశ్‌రావు ప్రస్తావించారు. ఇందులో రూ. 58 కోట్లను కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసినా పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆర్డీఎస్‌పై నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పాటిల్‌కు సూచించారు. దీనిపై స్పందించిన పాటిల్.. ఈ నెల 28న హరీశ్‌రావును బెంగళూరుకు రావాల్సిందిగా ఆహ్వానించారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)