amp pages | Sakshi

కలెక్టర్‌కు ఈసీ పిలుపు

Published on Tue, 04/02/2019 - 12:46

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావుకు ఎన్నికల సంఘం నుంచి పిలుపందింది. ఉన్నఫలంగా హైదరాబాద్‌ రావాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్‌ సోమవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్‌ తరలివెళ్లారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు సోమవారం హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌కు ఈ పిలుపు అందినట్లు తెలుస్తోంది. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో ప్రత్యేక పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించేందుకు కలెక్టర్‌ను పిలుపందినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

నిజామాబాద్‌ కలెక్టర్‌తో పాటు, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ హైదరాబాద్‌ వెళ్తూ సమీక్ష సమావేశాల నిర్వహణను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం వెంకటేశ్వర్లకు అప్పగించారు. కాగా తమ సమస్యను జాతీయ స్థాయిలో నిరసన తెలిపేందుకు పసుపు, ఎర్రజొన్న రైతులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా 185 చేరిన విషయం విధితమే. ఇక్కడ ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పోలింగ్‌ను బ్యాలెట్‌ ద్వారా నిర్వహించాలా? ఈవీఎంల ద్వారా నిర్వహించాలా అనేదానిపై ఎన్నికల సంఘం ఇటీవలే స్పష్టత ఇచ్చింది. ఎం–3 ఈవీఎంలతో పోలింగ్‌ జరపాలని కూడా ఆదేశించింది. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది.

 చెకింగ్‌కు సమాయత్తం.. 
అభ్యర్థుల సంఖ్య 185 చేరడంతో ఈ పార్లమెంట్‌ స్థానానికి 26,820 బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఈసీ ఆదేశించింది. అలాగే 2,240 కంట్రోల్‌ యూనిట్లు, 2,600 వీవీపీఏటిలను అందించాలని ఎన్నికల సంఘం ఈసీఐఎల్‌ను ఆదేశించింది. త్వరలోనే ఈ పరికరాలన్నీ జిల్లాకు చేరనున్నాయి. వీటి పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. వీటి పరిశీలన, పోలింగ్‌ నిర్వహణకు 600 మంది ఇంజనీర్‌లు కావాలని ఎన్నికల సం ఘం గుర్తించింది. ఈ ఈవీఎంల ఫస్ట్‌లెవల్‌ చెకింగ్, ర్యాండమ్‌ చెకింగ్‌ వంటి ప్రక్రియలు నిర్వహించాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ప్ర త్యేక ఇంజనీర్లు జిల్లాకు రానున్నారు.

ఈ మేరకు పరిశీలనకు ఏర్పాట్లు సిద్ధంగా ఉం డాలని జిల్లా అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశించారు. ఆయా రెవెన్యూడివిజన్ల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలను మరోమారు పరిశీలించి రెండు రోజుల్లో నివేదిక అందజేయాలని సహాయ రిటర్నింగ్‌ అధికారుల ను జేసీ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై జరిగిన సమీక్ష సమావేశంలో నిజామాబాద్‌ నగర పాలక సంస్థ కమిషనర్‌ జాన్‌శాంసన్, ఆర్మూర్, నిజామాబాద్‌ ఆర్డీవో లు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ట్రాన్స్‌పోర్టు డిప్యూటీ కమిషనర్‌ డి.వెంకటేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్‌ మహమ్మద్‌ ముర్తుజా, జిల్లా ఉన్నతాదికారులు చతుర్వేది, స్రవంతి, ఉదయ్‌ప్రకాష్, రాజారాం తదితరులు పాల్గొన్నారు.

ఏర్పాట్లపై దృష్టి..

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. బ్యాలెట్‌ ద్వారానే పోలింగ్‌ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎం వెంకటేశ్వర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపారు.  తన చాంబర్‌లో అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులతో సమావేశమయ్యారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి ఇప్పటికే మొదటి దశలో శిక్షణ ఇచ్చారు. తాజాగా రెండో దశ శిక్షణ తరగతులను నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు.

పోలింగ్‌ అధికారులు, సిబ్బందిని, అలాగే ఈవీఎంలు, ఇతర పోలింగ్‌ సామగ్రిని తరలించేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేయాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలు అందాయి. ఈసారి పోలింగ్‌ నిర్వహణకు వాహనాల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి కంట్రోల్‌ యూనిట్, వీవీప్యాట్‌లతో పాటు, 12 బ్యాలెట్‌ యూనిట్లను తరలించాల్సి ఉంటుంది. దీంతో సాధారణం కంటే రెట్టింపు స్థాయిలో వాహనాలు అవసరం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.  
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)