amp pages | Sakshi

ఉద్యోగుల చూపు బీజేపీ వైపు!

Published on Sat, 05/25/2019 - 02:07

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకే అత్యధికంగా పోస్టల్‌ ఓట్లు లభించాయి. తర్వాతి స్థానంలో ఎక్కువ ఓట్లు కాంగ్రెస్‌ అభ్యర్థులకు లభించగా, మూడో స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వచ్చినట్లు కౌంటింగ్‌ లెక్కల్లో తేలింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 17,319 మంది ఉద్యోగులు పోస్టల్‌ ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. వారిలో 6,196 మంది ఉద్యోగులు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేశారు. అంటే 35.77 శాత మంది ఉద్యోగులు బీజేపీ అభ్యర్థులకు ఓటేశారు. ఇక 5,162 మంది ఉద్యోగులు (29.8 శాతం) కాంగ్రెస్‌ అభ్యర్థులకు పోస్టల్‌ ఓట్లు వేయగా, 4,718 మంది ఉద్యోగులు (27.24 శాతం) టీఆర్‌ఎస్‌కు వేశారు.

మిగతా వారు ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీ, ఇతర పార్టీలకు చెందిన అభ్యర్థులకు వేశారు. మరోవైపు ఈ ఎన్నికల్లో చాలా తక్కువ మంది ఉద్యోగులు పోస్టల్‌ ఓట్లను ఉపయోగించుకున్నారు. పోలింగ్‌ సమయంలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగుల్లో దాదాపు 55 వేల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో 17,319 మంది మాత్రమే వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్‌ లెక్కలు తేల్చింది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌