amp pages | Sakshi

దివ్యాంగులకు ఊరట..

Published on Thu, 11/15/2018 - 14:47

పాల్వంచ రూరల్‌/చుంచుపల్లి: గతంలో దివ్యాంగులు, వృద్ధులు, బాలింతలు, పోలింగ్‌ కేంద్రాల వద్దకు రావాలంటే అనేక ఇబ్బందులు పడేవారు. దీంతో చాలామంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపేవారు కాదు. దీన్ని గమనించిన ఎన్నికల సంఘం దివ్యాంగులు పూర్తిస్థాయిలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టింది. దివ్యాంగులతోపాటు వృద్ధులు, గర్భిణులు, బాలింతలకు  మెరుగైన సేవలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దివ్యాంగులను ముందుగానే గుర్తించి పోలింగ్‌ కేంద్రాలకు ఉచితంగా వాహనాల ద్వారా తరలించనున్నారు. జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాల్లో కూడా ర్యాంపు సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. గతంలో ర్యాంపులు ఏర్పాటు చేసి ఉంటే మరమ్మతులు చేపడుతున్నారు. మూడు చక్రాల సైకిళ్లు అందుబాటులో ఉంచనున్నారు. దివ్యాంగులను నేరుగా పోలింగ్‌ కేంద్రంలోని ఈవీఎంల వద్దకు పంపించనున్నారు.

 
జిల్లాలో 15665 మంది దివ్యాంగ ఓటర్లు
జిల్లా వ్యాప్తంగా 995 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 8,47,528 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 19,274 మంది దివ్యాంగులు ఉన్నారు. వారిలో 15665 మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇల్లెందు నియోజక వర్గంలో అత్యధికగా 3565 మంది దివ్యాంగ ఓటర్లు ఉండగా, అత్యల్పంగా 2952 మంది భద్రాచలం నియోజకవర్గంలో  ఉన్నారు.

వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం
దివ్యాంగుల కోసం వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్‌కు ముందురోజే  లైజన్‌ ఆఫీసర్, గ్రామదీపికలు దివ్యాంగుల ఇంటికి వెళ్లి సమాచారం ఇస్తారు. వారిని ఆటో ద్వారా తీసుకొచ్చి, ఓటేశాక అదే ఆటోలో ఇంటికి చేర్చుతాం. గర్భిణులు, బాలింతలను ఇంటికి సురక్షితంగా చేరుస్తాం. జిల్లాలో దివ్యాంగులు, గర్భిణులు 100 శాతం ఓటుహక్కును వినియోగించుకునే విధంగా కృషి చేస్తున్నాం.  
–జగత్‌కుమార్‌రెడ్డి,జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారి 

  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)