amp pages | Sakshi

ఈ–టికెట్‌లలో గోల్‌మాల్‌!

Published on Fri, 11/02/2018 - 09:07

సాక్షి, సిటీబ్యూరో: కొద్ది రోజుల క్రితం రైల్వే విజిలెన్స్‌ అధికారులు హబ్సిగూడలోని ఒక ఏజెంట్‌ ఇంటిపై  దాడులు నిర్వహించారు. అందులో పట్టుబడిన రైల్వే టిక్కెట్‌లు చూసి అధికారులే విస్తుపోయారు. సుమారు రూ.1.5 లక్షల విలువైన టికెట్‌లను, వాటితో పాటు కంప్యూటర్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు ఏజెంట్‌ బినామీ పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి పెద్ద ఎత్తున అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఒక్క హబ్సిగూడకు చెందిన ఏజెంట్‌ మాత్రమే కాదు... నగరంలోని  వేలాది మంది రైల్వే టికెట్‌ ఏజెంట్‌లు ఇదే తరహా దందా నిర్వహిస్తున్నారు. ఆర్‌పీఎఫ్‌ పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు నిర్వహించే తనిఖీలు ప్రహసనంగా మారుతున్నాయి. అక్రమ దందాను అరికట్టేందుకు ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టకపోవడంతో ఏటా కోట్లాది రూపాయాల ప్రయాణికుల సొమ్ము దళారుల జేబుల్లోకి వెళ్తోంది. మరోవైపు ప్రతిఏటా దక్షిణమధ్య రైల్వే నిర్వహించే విజిలెన్స్‌ వారోత్సవాలు ఒక తంతుగానే మారుతున్నాయి.  

ఏ టు జడ్‌ ఐడీలు...  
దక్షిణమధ్య రైల్వేలో ప్రతిరోజు సుమారు లక్ష టికెట్‌లను విక్రయిస్తారు. వీటిలో 40వేల  టికెట్‌లు రైల్వే స్టేషన్‌లలోని బుకింగ్‌ కౌంటర్‌ల నుంచి విక్రయిస్తుండగా... 60వేల టికెట్‌లు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ నుంచి  విక్రయిస్తున్నారు. ప్రయాణికులు తమ సొంత ఐడీలపైన ఈ టికెట్‌లను బుక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌తో పాటు నమోదైన ఐడీపైన 12 టికెట్‌లు, సాధారణ ఐడీలపైన 6టికెట్ల వరకు బుక్‌ చేసుకునేందుకు ప్రయాణికులకు వెసులుబాటు ఉంది. అలాగే నామమాత్రపు చార్జీలతో ఏజెంట్‌ల వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. తత్కాల్‌ టికెట్‌లను బుక్‌ చేసుకునేందుకు ప్రయాణికులకు ఉదయం 10గంటలకే అనుమతి లభిస్తుండగా, ఏజెంట్‌లకు  మాత్రం అరగంట ఆలస్యంగా ఉదయం 10:30గంటలకు లభిస్తుంది. ఈ క్రమంలోనే ఏజెంట్‌లు అక్రమాలకు తెరలేపుతున్నారు. ఏజెంట్‌గా నమోదు చేసుకొని ఐఆర్‌సీటీసీ నుంచి పొందిన గుర్తింపుపై కాకుండా బినామీ  పేర్లపైన సాధారణ ప్రయాణికులుగా నమోదు చేసుకున్న ఐడెంటిటీలపై తత్కాల్‌ టికెట్‌లను కొల్లగొడుతున్నారు.

వాటిని ప్రయాణికులకు రెట్టింపు చార్జీలకు కట్టబెడుతున్నారు. రిజర్వేషన్‌లలోనూ ఇదే తరహా బినామీ దందా కొనసాగుతోంది. ‘ఇందుకోసం ఏ నుంచి జడ్‌ వరకు ఉన్న 26 అక్షరాలపై రకరకాల ఐడీలను సృష్టిస్తారు. ఈ ఐడీలపైనే పెద్ద ఎత్తున టికెట్‌లు బుక్‌ చేస్తారు. ఒకే  కంప్యూటర్‌ నుంచి ఈ రకమైన బినామీ ఐడీలు వందల కొద్దీ నమోదై  ఉంటాయి’ అని దక్షిణమధ్య రైల్వే విజిలెన్స్‌ అధికారి ఒకరు ‘సాక్షి’తో విస్మయం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఏజెంట్‌ల అక్రమ దందా భారీ ఎత్తున కొనసాగుతోందని చెప్పారు. పండగలు, వరుస సెలవుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు టికెట్లను రెట్టింపు చార్జీలకు కట్టబెడుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌ వరకు స్లీపర్‌ క్లాస్‌ టికెట్‌  చార్జీ రూ.450 వరకు ఉంటే రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో ఏజెంట్‌లు రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు అంచనా. ఇలా ఒక్క హైదరాబాద్‌లోనే ఏటా కోట్లాది రూపాయాల అక్రమ దందా కొనసాగుతోంది.  

చర్యలు శూన్యం...  
నకిలీ ఐడీలపై బల్క్‌గా టికెట్‌లను బుక్‌ చేస్తూ ప్రయాణికుల నిలువుదోపిడీకి పాల్పడడమే కాకుండా... రైల్వేను సైతం పెద్ద ఎత్తున మోసం చేస్తోన్న ఏజెంట్‌ల అక్రమాలను అరికట్టేందుకు చేపడుతున్న చర్యలు మొక్కుబడిగానే ఉన్నాయి. ఏటా విజిలెన్స్‌ వారోత్సవాల సందర్భంగా దాడులు చేసి కేసులు నమోదు చేయడం మినహా ఈ అక్రమ దందాను అరికట్టలేకపోతున్నారు.

ప్రతి రోజు వెబ్‌సైట్‌ నుంచి బుక్‌ అయ్యే టికెట్‌లు ఏ సిస్టమ్‌ నుంచి బుక్‌ అవుతున్నాయనేది నమోదవుతుంది. సాధారణ ప్రయాణికులైతే ఏ నెలకో, ఆరు నెలలకో ఒకసారి తమ అవసరాల మేరకు టికెట్‌లను బుక్‌ చేసుకుంటారు. ప్రయాణకులు ఏ కంఫ్యూటర్‌ నుంచి ఎన్ని టికెట్‌లు బుక్‌ చేసుకున్నదీ తెలిసిపోతుంది. అదే విధంగా ఏజెంట్‌లు ఒకే కంప్యూటర్‌ నుంచి ప్రతిరోజు రకరకాల  ఐడీలపైన టికెట్‌లు బుక్‌ చేస్తున్నప్పుడు కచ్చితంగా గుర్తించి చర్యలు తీసుకోవచ్చు. రైల్వే యాక్ట్‌లోని సెక్షన్‌ 143  ప్రకారం రూ.10వేల వరకు జరిమానా విధిస్తారు. ఏడాది పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. కానీ ఆర్‌పీఎఫ్, విజిలెన్స్‌ అధికారులు నిర్వహించే మొక్కుబడి దాడుల కారణంగా ఏజెంట్‌ల అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)