amp pages | Sakshi

రైతు సమస్యలపై పట్టింపేది?

Published on Fri, 05/15/2015 - 01:43

- రాష్ట్ర ప్రభుత్వానిది మొసలి కన్నీరు
- రాహుల్ రాజకీయం చేస్తున్నాడు
- బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఆదిలాబాద్ రిమ్స్ :
రైతు సమస్యలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొసలి కన్నీరు కారుస్తోందని, రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని బీజేపీ జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్ విమర్శించారు. బీజేపీ కిసాన్‌మోర్చ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే మాటమార్చిందని దుయ్యబట్టారు. ఓ వైపు అప్పులు చెల్లించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే రుణాలు విడతల వారీ గా మాఫీ చేయడం సరికాదని అన్నారు. బ్యాంకు బకాయిలను ఒకేసారి మాఫీ చేసి ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ ఏడాది జిల్లాలో కరువు ఏర్పడినా కేంద్రానికి కరువు నివేదిక పంపకపోవడంతో రైతులకు కరువు సహాయం కూడా అందలేదని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఇప్పటివరకు అధికార పార్టీ నాయకులు ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించలేదని ఎద్దేవా చేశారు. వాతావరణం అనుకూలించక పం టలు సరిగా పండలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వం కూడా గిట్టుబాటు ధర కల్పించలేదని తెలిపారు. ఈ ఏడాది కనీసం విత్తనాలు కొనుగోలు చేసే పరిస్థితిలో రైతులు లేనందున 90 శాతం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. జిల్లాలో రైతుయాత్ర చేపడుతున్న రాహుల్‌గాంధీ రైతు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వేల ఎకరాలు కార్పొరేట్ వ్యాపారులకు అప్పగించిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీని విమర్శించే హక్కు లేదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలన లో వ్యవసాయ అభివృద్ధి కుంటుపడిందని ఎద్దేవా చేశా రు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రధాన మం త్రి నరేంద్రమోగీ కృషి చేస్తున్నారని తెలిపారు. బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయల శంకర్, ఉపాధ్యక్షురాలు సుహాసిని, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షుడు దీపక్‌సింగ్ షెకావత్, ఉపాధ్యక్షుడు మడావి రాజు, నాయకులు రఘుపతి, జోగు రవి పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)