amp pages | Sakshi

గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌!

Published on Tue, 03/26/2019 - 03:02

మెదక్‌ రూరల్‌: మెదక్‌ జిల్లాలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హవేళిఘణాపూర్‌ మండల కేంద్రంలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. హవేళిఘణాపూర్‌ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ఆదివారం రాత్రి అన్నం, చారు, బెండకాయతో భోజనం చేసి నిద్రపోయారు. సోమవారం తెల్లవారుజామున సుమారు 30 మంది విద్యార్థినులు తీవ్ర కడుపునొప్పి, విరేచనాలు, వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారి బాగోగులు చూసే నర్సు అందుబాటులో లేకపోవడంతో అస్వస్థతకు గురైన పిల్లలను సిబ్బంది మెదక్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

వీరిలో 7, 8 వ తరగతికి చెందిన చంద్రిక, నాగవర్ష, శిరీష, మౌనిక, సంధ్య, లతిక అనే ఆరుగురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజులుగా నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని పలువురు విద్యార్థినులు వాపోతున్నారు. పిల్లలు అస్వస్థతకు గురైన విషయాన్ని తమకు తెలియజేయకపోవడంపై కొందరు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై పాఠశాల ప్రిన్సిపాల్‌ శోభాదేవి మాట్లాడుతూ.. పాఠశాలలో మొత్తం 298 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని అన్నారు. 

పరీక్షించిన డీఎంహెచ్‌వో.. 
చికిత్స పొందుతున్న విద్యార్థినుల నుంచి డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా వైద్యు లను ఆదేశించారు. ఫుడ్‌ పాయిజన్‌కు గల కారణాలపై విచారిస్తామన్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి పరిసరాలు, విద్యార్థులుండే ప్రాంతా న్ని శుభ్రంగా ఉంచాలని సూచించారు. మండల వైద్యుడు చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులకు పరీక్షలు చేసి మందులను అందజేశారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌