అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక అదృశ్యం
Published on Fri, 01/08/2016 - 19:52
యాకుత్పురా : ఇంట్లో చెప్పకుండా బయటికు వెళ్లిన ఓ బాలిక అదృశ్యమైన సంఘటన భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. భవానీనగర్ తలాబ్కట్టా ప్రాంతానికి చెందిన సయ్యద్ సలీం, షహనాజ్ ఉన్నీసా దంపతుల కూతురు బషీరున్నీసా (16) ఇంట్లోనే ఉంటుంది. ఈ నెల 7వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది.
చార్మినార్ వద్ద బట్టల దుకాణంలో పని చేసే తల్లి షహనాజ్ ఉన్నీసా రాత్రి ఇంటికి వచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్నీ ప్రాంతాల్లో వాకబు చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
#
Tags