amp pages | Sakshi

అప్రమత్తంగా ఉండండి.. ఆందోళన వద్దు

Published on Sat, 03/21/2020 - 03:28

సాక్షి, హైదరాబాద్‌: ‘తెలంగాణ సోదర సోదరీమణులారా చేతులు బాగా కడుక్కోండి, దూరాన్ని పాటించండి. ఇంట్లోనే ఉండండి. ‘కోవిడ్‌’లక్షణాలు ఉన్నట్లు అనుమానాలు వస్తే డాక్టర్‌ను సంప్రదించండి. అప్రమత్తంగా ఉండండి. కానీ ఆందోళన పడకండి. ప్రభుత్వం మీతో ఉంది’అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రజలకు భరోసా ఇచ్చారు. కోవిడ్‌ –19 ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె పిలుపునిచ్చారు. ప్రజలను రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయని, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును ప్రజలు పాటించాలని గవర్నర్‌ కోరారు.

కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచం కూడా ఈ భయంకర పరిస్థితిని ఎదుర్కుంటోందన్నారు. గతంలో మన పెద్దలు యుద్ధాలను చూశారని, ప్రస్తుత తరం వైరస్‌ రూపంలో ‘బయో వార్‌’ను ఎదుర్కొంటున్నదని గవర్నర్‌ వ్యాఖ్యానించారు. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అప్రమత్తంగా, నైతిక స్థైర్యాన్ని కలిగి ఉండాలని గవర్నర్‌ తమిళి సై సూచించారు. ‘కోవిడ్‌’పై పోరులో వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, అధికారులు, ప్రజా రవాణా సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది చూపుతున్న చిత్తశుద్ధిని గవర్నర్‌ ప్రశంసించారు. ‘కోవిడ్‌’కు నివారణే చికిత్స అని, ఇళ్లలోనే ఉండి ఇంటి వద్ద నుంచే పనులు చేయాలని, విదేశాల నుంచి వచ్చే వారు 14 రోజుల సెల్ఫ్‌ క్వారంటైన్‌ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

22న రాజ్‌భవన్‌లో థ్యాంక్స్‌ గివింగ్‌
ప్రధాని మోదీ పిలుపుమేరకు ఈ నెల 22న ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. ‘కోవిడ్‌’ను అరికట్టేందుకు పోరాడుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ నెల 22న సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తమిళిసై వెల్లడించారు. రాజ్‌భవన్‌లో పనిచేసే ఉద్యోగులకు రోజూ థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి, ఉష్ణోగ్రతలు నమోదు చేస్తున్నామని, చేతులు శుభ్రం చేసుకోవడంపై తమ సిబ్బందికి అవగాహన కల్పించినట్లు గవర్నర్‌ వెల్లడించారు. 65ఏళ్లు పైబడిన వారిని బయటకు పంపకుండా చూసుకోవాలని, మురికివాడల్లో ఉండే వారు కూడా సబ్బుతో చేతులు కడుక్కునేలా అవగాహన కల్పించాలని గవర్నర్‌ సూచించారు. మీడియా సమావేశానికి వచ్చిన గవర్నర్‌కు రాజ్‌భవన్‌ వైద్య బృందం థర్మల్‌ స్క్రీనింగ్‌ చేశారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)