amp pages | Sakshi

కేరళకు విరాళాల వెల్లువ

Published on Wed, 08/22/2018 - 01:30

సాక్షి, హైదరాబాద్‌: కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ఉద్యోగులు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారు.

విరాళాలు అందించిన వారు..
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక రోజు బేసిక్‌పేను విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం సీఎస్‌ ఎస్‌కే జోషిని కలిసిన ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ కారం రవీందర్‌రెడ్డి రూ.48 కోట్లకు సమ్మతి పత్రాన్ని అందించారు.  
 తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులంతా ఒక రోజు వేతనాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు.  
 రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఉద్యోగులంతా ఒక రోజు వేతనానికి సంబంధించి రూ.9 కోట్ల చెక్కును మంత్రి జగదీశ్‌రెడ్డికి అందించారు.  
♦  రాజ్‌భవన్‌ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. అలాగే గవర్నర్‌ నరసింహన్‌ సతీమణి విమలా నరసింహన్‌ రూ.10 వేలు విరాళాన్ని అందించారు.  
రాష్ట్రంలోని తహసీలార్లు, వీఆర్వోలు తమ ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు గౌతమ్‌కుమార్‌ సీఎస్‌ జోషికి అంగీకార పత్రం అందించారు.  
♦  రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం తరఫున రూ.4 కోట్లు అందిస్తున్నట్లు సంఘం ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి తెలిపారు.  
 తెలంగాణ మున్సిపల్‌ కమిషనర్‌ అసోసియేషన్‌ తమ ఒక రోజు జీతాన్ని విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం మున్సిపల్‌ కమిషనర్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు మంత్రి కేటీఆర్‌కు అనుమతి పత్రాన్ని అందజేశారు.  
 కేరళకు పంపే నిత్యావసర వస్తువులు, సరుకులను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ తెలిపారు. కాగా, దక్షిణ మధ్య రైల్వే 60 టన్నుల వస్తు సామగ్రిని మంగళవారం కేరళకు పంపింది. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)