amp pages | Sakshi

గ్రూప్‌–1 ఎంపిక జాబితా ఉపసంహరణ

Published on Tue, 10/31/2017 - 02:23

సాక్షి, హైదరాబాద్‌ :  గ్రూప్‌–1 (2011) ఎంపిక జాబితాను టీఎస్‌పీఎస్సీ ఉపసంహరించింది. శనివారం ప్రకటించిన పోస్టింగుల్లో తప్పిదాలున్నట్లు తెలియడంతో సోమవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పోస్టులకు అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోవడంలో సెంటర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (సీజీజీ) పొరపాటు చేయడంతో పోస్టింగులు మారిపోయాయి. టాప్‌ ర్యాంకర్లకు ప్రాధాన్యంలేనివి.. దిగువన ఉన్న వారికి ప్రాధాన్యమున్న పోస్టులు లభించాయి.

దీంతో తామిచ్చిన ఆప్షన్లకు, వచ్చిన పోస్టుకు సంబంధం లేకుండా ఉందని..టాప్‌ ర్యాంకు సాధించినా ప్రాధాన్యంలేని పోస్టు కేటాయించారని ఆప్షన్ల ఫారాలు టీఎస్‌పీఎస్సీ అధికారులకు చూపించి అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన టీఎస్‌పీఎస్సీ.. సీజీజీ అధికారులతో అత్యవసరంగా సమావేశమైంది. సీజీజీ జరిపిన కేటాయింపులు, అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు పరిశీలించి పొరపాట్లు దొర్లినట్లు గుర్తించింది.

విషయాన్ని సీఎం కేసీఆర్, సీఎస్‌ ఎస్పీ సింగ్‌కు టీఎస్‌పీఎస్సీ తెలుపగా.. అభ్యర్థుల ర్యాంకులు, వారి ఆప్షన్లను లోతుగా పరిశీలించాలని, మాన్యువల్‌గా చూసి మళ్లీ పోస్టింగులు ఖరారు చేయాలని సూచించారు. దీంతో శనివారం వెల్లడించిన ఫలితాలను టీఎస్‌పీఎస్సీ నిలిపేసింది. ర్యాంకుల ప్రకారం 121 మందికి కేటాయించిన పోస్టింగులు, ఆప్షన్లు, రోస్టర్, రిజర్వేషన్లను మరోసారి సమీక్షించి ఒకట్రెండు రోజుల్లో మళ్లీ ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించింది. కాగా, ఈ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ పొరపాటు ఏమీ లేదని, సీజీజీలోనే పొరపాటు దొర్లినట్లు ప్రభుత్వం పేర్కొంది. తప్పిదాలకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.  

టీఎస్‌పీఎస్సీ ప్రకటనలోని అంశాలివీ..
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇచ్చిన వెబ్‌ ఆప్షన్లు, వారికి సంబంధించి సీజీజీ ఇచ్చిన సమాచారం ప్రకారం పోస్టులు కేటాయించాం. అయితే తామిచ్చిన ఆప్షన్ల ప్రకారం పోస్టింగ్‌లు రాలేదని సోమవారం ఇద్దరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దీంతో సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్రనిమ్‌జే, డైరెక్టర్‌ విజయ్‌కరణ్‌రెడ్డితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి వివరణ కోరాం. తామిచ్చిన సమాచారాన్ని (డాటా) మరోసారి పరీశిలించిన సీజీజీ .. పోస్టుల కోసం అభ్యర్థులు ఇచ్చిన వెబ్‌ ఆప్షన్ల ప్రాధాన్యాల్లో పొరపాట్లు దొర్లినట్లు పేర్కొంది. మొత్తం సమాచారాన్ని మరోసారి పరిశీలిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో 28న ఇచ్చిన ఎంపిక జాబితాను ఉపసంహరిస్తున్నాం. కొత్త జాబితాను తరువాత ప్రకటిస్తాం.


వారంలో మార్కుల వివరాలు
అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఇంటర్వ్యూకు హాజరైన వారి మార్కుల జాబితాను ప్రకటించాలని నిర్ణయించినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. తుది ఎంపిక జాబితా ప్రకటించాక వారం రోజుల్లో మార్కుల జాబితా ప్రకటిస్తామని పేర్కొంది.

#

Tags

Videos

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)