అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
వెంటాడిన విషాదం
Published on Fri, 08/21/2015 - 00:47
రాజాపేట : ఒకే ఇంట్లో ఇద్దరు మృతిచెందగా ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. మండలకేంద్రానికి చెందిన స్వర్గం అనసూయ (80) గురువారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందింది. సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తుండగా అనసూయ మరిది స్వర్గం లక్ష్మయ్య (73) గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
వదిన మృతిని జీర్ణించుకోలేక చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మృతునికి భార్య నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో అంత్యక్రియలకు వచ్చిన బంధువులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. దీంతో ఎవరినోట విన్నా వీరి మృతివార్తే వినిపించింది. లక్ష్మయ్య కృషి చేనేత సహాకార సంఘం సభ్యుడు కావడంతో సంఘం సభ్యులు సంతాపాన్ని తెలియజేశారు.
#
Tags