విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రాఖీ కట్టండి.. హెల్మెట్ ఇవ్వండి
Published on Tue, 08/21/2018 - 09:27
సాక్షి, సిటీబ్యూరో: రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరూ అక్కాచెల్లెళ్లు.. తమ అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టి హెల్మెట్ బహుమతిగా ఇవ్వాలని సిటీ సీపీ అంజనీకుమార్ పిలుపునిచ్చారు. ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చని అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సిస్టర్ ఫర్ ఛేంజ్... గిఫ్ట్ ఎ హెల్మెట్’ అవగాహన ర్యాలీని ఆయన సోమవారం కమిషనర్ కార్యాలయం వద్ద ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు జాగృతి సభ్యులను అభినందిస్తున్నానన్నారు. జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు విజయ్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
#
Tags