amp pages | Sakshi

కారణాలు తెలియకుండా విచారణ ఎలా?

Published on Tue, 10/17/2017 - 02:24

సాక్షి, హైదరాబాద్‌: ‘కారణాలు వెల్లడించకుండానే కాళేశ్వరం పనులు ఆపేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని చెబుతున్నారు.. మరి ఆ కారణాలు తెలియకుండా దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలా విచారణ జరుపుతాం’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏ పనులూ కొనసాగించొద్దని, పనులన్నీ వెంటనే నిలిపేయాలని ఈ నెల 5న ఎన్‌జీటీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఉత్తర్వుతో రోజుకు రూ.100 కోట్ల నష్టం వాటిల్లుతోందంటూ ప్రభుత్వం, నీటిపారుదల శాఖ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యం విషయమై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ మంతోజ్‌ గంగారావులతో కూడిన ధర్మాసనం ముందు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి సోమవారం ఉదయం ప్రస్తావించారు. ప్రాజెక్టు పనులు నిలిపేయాలని హడావుడిగా ఎన్‌జీటీ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.

ఉత్తర్వులు జారీ చేసిన ధర్మాసనంలో ఓ సభ్యుడు పదవీ విరమణ చేస్తున్నప్పుడే మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తాము చేపడుతున్నది తాగునీటి ప్రాజెక్టు పనులేనని, ఇందుకు అటవీ అనుమతులు అవసరంలేదని ఎన్‌జీటీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు.

ధర్మాసనం స్పందిస్తూ.. సెలవులు వచ్చినప్పుడు ఉత్తర్వుల కాపీ అందకపోవడం సహజమేనని.. ప్రాజెక్టు పనులను ఏ కారణాలతో ఎన్‌జీటీ నిలిపేసిందో తెలుసుకోకుండా విచారణ చేపట్టడం కష్ట సాధ్యమని పేర్కొంది. తీర్పు పూర్తి పాఠం కోసం ప్రయత్నిస్తున్నామని ఏజీ చెప్పగా, మధ్యాహ్నం విచారణ జరిపేందుకు ప్రయత్నిస్తామంది. కానీ మిగిలిన కేసుల విచారణతోనే కోర్టు సమయం ముగియడంతో వ్యాజ్యం విచారణ జరగలేదు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)