amp pages | Sakshi

ఇదీ రాజ్‌భవన్‌ పాఠశాల పరిస్థితి

Published on Fri, 07/13/2018 - 13:17

అది అత్యాధునిక పాఠశాల... అడ్మిషన్ల కోసం పోటీపడి మరీ 1,300 మంది విద్యార్థులు చేరారు. కానీ తీరా చూస్తే... ఆరుగురు టీచర్లే అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదీ రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి. స్వయంగా గవర్నర్‌ నరసింహన్‌ పర్యవేక్షణలో కొనసాగుతున్నపాఠశాలలోనే ఇలాంటి దుస్థితి తలెత్తడం శోచనీయం. అయితే గవర్నర్‌ సహా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పాఠశాల కొనసాగుతుండడంతో ఇక్కడికి రావడానికి ఉపాధ్యాయులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.  

సాక్షి, హైదరాబాద్‌ ‌: రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాల.. ప్రత్యేకంగా గవర్నర్‌ నరసింహన్‌ పర్యవేక్షణ.. డిజిటల్‌ క్లాస్‌ రూంలు.. అత్యాధునిక సౌకర్యాలతో రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించిన భవనం.. ఇన్ని ప్రత్యేకతలున్న పాఠశాల అంటే ఏ విద్యార్థికైనా ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ విద్యా సంవత్సరం రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు క్యూ కట్టారు. దీంతో పరిమితికి మించి ప్రవేశాలు జరిగాయి. ఏకంగా ఉన్నత పాఠశాలలో 650 మంది, ప్రాథమిక పాఠశాలలో 650 మంది విద్యార్థులు చేరారు. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది కానీ.. ఉపాధ్యాయుల సంఖ్య దగ్గరకు వచ్చేసరికి మాత్రం డొల్లతనం బయటపడింది. ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో ఈ పాఠ«శాల నుంచి 12 మంది బదిలీ అయ్యారు. వీరి స్థానంలో కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే వచ్చారు. రాజ్‌భవన్‌ స్కూలుకు రావడానికి చాలా మంది టీచర్లు మొగ్గు చూపించలేదు. ఇక్కడ నిరంతరం గవర్నర్‌ పర్యవేక్షణ, విద్యాశాఖ అధికారుల ప్రమేయం అధికంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇకపోతే ఉన్నత పాఠశాల రెగ్యులర్‌ హెచ్‌ఎం కూడా లేకపోవడంతో డిప్యూటీ డీఈఓ శామ్యూల్‌రాజును ఇన్‌చార్జిగా నియమించారు. నిబంధనల ప్రకారం.. ఈ స్కూల్‌ గ్రేడ్‌– 1 హెచ్‌ఎం ఉండాలి. 15 ఏళ్లుగా గ్రేడ్‌– 1 హెచ్‌ఎం పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఇన్‌చార్జిలతోనే సరిపెడుతున్నారు.  

ప్రాథమిక పాఠశాలలో నో టీచర్స్‌.. 
రాజ్‌భవన్‌ ప్రాథమిక పాఠశాలలో ఒక్క టీచర్‌ కూడా లేరంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడున్న ప్రధానోపాధ్యాయురాలు మంజులత ఇన్‌చార్జి కావడం గమనార్హం. కనీసం విద్యావలంటీర్లతోనైనా చదువులు నెట్టుకొద్దామంటే ఒక్కరు కూడా లేకపోవడం విద్యార్థుల భవిష్యత్‌ పట్ల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.  
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)