amp pages | Sakshi

‘ఆదర్శానికి' మంగళం...

Published on Wed, 09/24/2014 - 03:31

కరీంనగర్‌అగ్రికల్చర్ :
 క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికారిక ఉత్తర్వులు రావడమే తరువాయి.. జిల్లాలో 1892 మంది ఆదర్శ రైతులకు ఉద్వాసన కలగనుంది. వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా మల్టీపుల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(ఎంపీఈవో)ల నియామకానికి మొగ్గు చూపుతోంది.
 విభజన అనంతరం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సరా ్కర్ ఆదర్శ రైతు వ్యవస్థకు మంగళం పాడి ఉత్తర్వులు జారీచేసింది.  తెలంగాణ సర్కార్ సైతం ఈ అం శంపై అన్నివిధాలా ఆలోచించి చివరకు రద్దు చేసేం దుకే మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. వ్యవసాయశాఖకు, రైతులకు మధ్య వారధిగా పనిచేసే ఉద్దేశంతో దివంగత వైఎస్సార్ 2007లో ఆదర్శ రైతు వ్యవస్థను ప్రవేశపెట్టారు. మొ దట్లో బాగానే ఉన్నా ఆయన మరణానంతరం పక్కదోవ పట్టింది. వీరికి నెలకు రూ.వేయి గౌరవ వేతనంగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 2500 మంది ఆదర్శరైతుల నియామకం జరిగింది. ఆ త ర్వాత విధుల్లో నుంచి తొలగించడం, వివిధ కారణాలతో ఆ సంఖ్య 1,892కు చేరింది. సంస్కరణలో భా గంగా ఆదర్శ రైతులతో ప్రయోజనం లేదని భా విస్తూ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రస్తుత స ర్కార్ ప్రణాళిక రూపొందించుకుంది. ఈ మేరకు జి ల్లాలో 1892 మంది రైతులకు నెలకు గౌరవవేతనం గా ఇస్తున్న రూ.18.92 లక్షలను ఆదా చేయనుంది.
 ఎంపీఈవోల వ్యవస్థ...
 రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కరించాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆదర్శ  వ్యవస్థ స్థానంలో గతంలో అమలులో ఉన్న మల్టీఫుల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల నియామకం చేపట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. 2004కు ముందు గ్రామాల్లో రైతుమిత్ర గ్రూపులు ఏర్పాటుచేసి వాటిని సమీకరించి గ్రామైఖ్య సంఘాలను ప్రతి నెలా సమావేశాలు నిర్వహించేందుకు ఎంపీఈవోలను నియమించారు. చిన్న మండలాల్లో ముగ్గురు, పెద్ద మండలాల్లో ఐదుగురి చొప్పున నియమించి ఈ సంఘాల నిర్వహణ బాధ్యతలు అప్పగించేవారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు కుటుంబాలను బట్టి జిల్లాలో 2,500 మంది ఆదర్శ రైతులను నియమించినప్పటికీ క్రమంగా వివిధ కారణాలతో పలువురిని తొలగించగా 1896 మంది పనిచేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో గ్రామంలో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఆదర్శ రైతులున్నారు. వీరి స్థానంలో ఎంఈవోలను నియమించి రెండు మూడు గ్రామాలకొకరిని నియమించుకుంటే ఆదర్శ రైతులకు ఇస్తున్న గౌరవ వేతనం సరిపోతుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది.


 

Videos

టీడీపీ దుష్ప్రచారాలపై తానేటి వనిత ఫైర్..

చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్

మత్స్యకారులకు గుడ్ న్యూస్

టీడీపీ మేనిఫెస్టోపై భరత్ సెటైర్లు..

చంద్రబాబు ఉచిత ఇసుకలో ఉచితం లేదు

టీడీపీ బైరెడ్డి శబరిపై రెచ్చిపోయిన వైఎస్సార్సీపీ మహిళా నేత..

ఎల్లో మీడియా కుట్రలు..బద్దలు కొట్టిన సీఎం జగన్..

ముస్లింలకు బాబు టోపీ

మీ జగన్ గెలిస్తేనే స్కీములు కొనసాగింపు

సింహాచలం ఆలయంలో భక్తుల రద్దీ

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు