amp pages | Sakshi

‘మహా’ దోపిడీ మళ్లీ షురూ!

Published on Mon, 02/19/2018 - 15:03

మంజీర తీరంలో ‘మహా’ అలజడి మొదలైంది.. మన భూభాగంలో ఇసుక దోపిడీ మళ్లీ షురువైంది.. అనుమతుల ముసుగులో మహారాష్ట్ర కాంట్రాక్టర్లు అంతర్రాష్ట్ర సరి‘హద్దులు’ దాటుతున్నారు. జిల్లా భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నారు. మరోవైపు, మన వారే ‘మహా’ కాంట్రాక్టర్ల అవతారమెత్తి ఇసుకను కొల్లగొడుతున్నారు. ఆ ఇసుకను దెగ్లూర్, మద్నూర్‌ మీదుగా హైదరాబాద్, బీదర్‌ తదితర ప్రాంతాలకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ఇలాగే ఇసుక తరలిస్తుండగా, జిల్లా అధికారులు దాడి చేసి జేసీబీని పట్టుకున్నారు. సుమారు 16 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించుకు పోయినట్లు అధికారులు నిర్ధారించారు. తరచూ తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకు వచ్చి అక్రమంగా ఇసుక తవ్వేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారి తీస్తోంది.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌ : ‘మహా’ దోపిడీ మళ్లీ షురువైంది. మహారాష్ట్ర క్వారీల పేరుతో తెలంగాణ భూభాగంలోని మంజీర నదిలో ఇసుకను తోడేస్తున్నారు. నదిలో అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. శాఖాపూర్‌ (మహారాష్ట్ర) ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అక్రమంగా తెలంగాణ భూభాగంలోకి చొచ్చుకువచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతుండగా.. నిజామాబాద్‌ జిల్లా అధికార యంత్రాంగం గురువారం దాడి చేసి పట్టుకున్నారు. తెలంగాణ భూభాగంలోకి చొరబడి తోడేస్తున్న భారీ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. నదిలో రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా.. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు నాలుగు ఎకరాల లోనికి సరిహద్దు లు దాటి తెలంగాణ భూభాగంలో అక్ర మంగా ఇసుక తోడేసినట్లు గుర్తించారు. ఈ ఒక్కచోటే సుమారు 16 వేల క్యూ బిక్‌ మీటర్ల ఇసుకను మహారాష్ట్ర కాంట్రాక్టర్లు తవ్వుకు పోయినట్లు ప్రాథమికంగా గుర్తించా రు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. మంజీర న ది వెడల్పులో సగ భూభా గం తెలంగాణది.. మరోసగం మహారాష్ట్రకు ఉంటుంది. అయితే తెలంగాణ భూభాగంలో ఇసుక తోడేస్తుండడం అంతర్రాష్ట్ర వివాదానికి దారితీస్తోంది.

రాత్రయితే చొరబాట్లు.. 
చీకటి పడితే చాలు మహారాష్ట్ర జేసీబీలు తెలంగాణ భూభాగంలోకి వచ్చి అక్రమంగా చొరబడుతున్నాయి. భారీ జేసీబీలతో రాత్రికి రాత్రి వందల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తోడేయడం పరిపాటిగా మారింది. స్థానికులు ఫిర్యాదు చేస్తే తప్ప జిల్లా అధికార యంత్రాంగం ఈ అక్రమ చొరబాట్ల గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర ఇసుక వనరులు దోపిడీకి గురవుతుండగా.. ఈ క్వారీల ఆదాయంతో మహారాష్ట్ర సర్కారు ఖజనా నిండుతోంది. 

మన వారే ‘మహా’ కాంట్రాక్టర్లు.. 
మహారాష్ట్ర క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి తెర లేపిన కాంట్రాక్టర్లు మన రాష్ట్రం వారే కావడం గమనార్హం. ముఖ్యంగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు మహారాష్ట్ర వ్యక్తులను తెరపైకి తెచ్చి ఇసుక దోపిడీకి తెర లేపుతున్నారు. పైగా ఇక్కడి ఇసుకను దెగ్లూర్‌ (మహారాష్ట్ర), మద్నూర్‌ మీదుగా హైదరాబాద్, బీదర్‌ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు భారీ సంఖ్యలో ఇసుక వాహనాలు ఇలా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాయి. మన ఇసుకను మహారాష్ట్ర క్వారీల పేరుతో తోడేసి.. మళ్లీ మన తెలంగాణలోనే విక్రయిస్తూ.. మహారాష్ట్ర సర్కారు ఖజానాను నింపుతున్న అక్రమార్కులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రూ.కోట్లల్లో ఆదాయం 
ఏటా మహారాష్ట్ర ప్రభుత్వం మంజీర నదిలో తమ వైపు ఉన్న ఇసుక క్వారీలకు టెండర్లు పిలుస్తుంది. ఈ ఏడాది సుమారు పది క్వారీలకు టెండర్లు పిలిచారు. ఒక్కో క్వారీకి రూ.20 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు మహారాష్ట్ర సర్కారు ఆదాయాన్ని గడిస్తోంది. అక్కడి గనుల శాఖ ద్వారా నాందేడ్‌ జిల్లా అధికారులు ఈ క్వారీలకు టెండర్లు ఆహ్వానించారు. ఈ క్వారీల్లో ప్రస్తుతానికి శాఖాపూర్, షెల్‌గాం క్వారీల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే, ఆయా  క్వారీల కాంట్రాక్టర్లు తమకు నిర్దేశించిన మహారాష్ట్ర భూభాగంలో కాకుండా.. అక్రమంగా తెలంగాణ సరిహద్దుల్లోకి చొచ్చుకువచ్చి ఇసుకను తోడేస్తున్నారు. 

అటువైపు నిండుకున్న ఇసుక నిల్వలు.. 
మంజీర నదికి అవతలి వైపు క్వారీలకు ఏటా టెండర్లు పిలిచి భారీగా తవ్వేస్తుండడంతో అటువైపు ఇసుక నిల్వలన్నీ అయిపోయాయి. నాణ్యత లేని నల్ల ఇసుక, మట్టితో కూడిన ఇసుక మాత్రమే మిగిలింది. దీంతో కాంట్రాక్టర్లు రాష్ట్ర సరిహద్దులు దాటి తెలంగాణ భూభాగం పరిధిలోకి చొచ్చుకొచ్చి తవ్వకాలు చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది.   

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)