amp pages | Sakshi

వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే అనర్థమే

Published on Tue, 10/18/2016 - 03:38

జేఏసీ చైర్మన్ కోదండరాం
ఈ నెల 23న రైతు దీక్ష...పోస్టర్ ఆవిష్కరణ
నకిలీ విత్తన కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయాన్ని వదులుకుంటే ఆహార సంక్షోభంతో అనర్థం తప్పదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హెచ్చరించారు. రైతు సమస్యలపై ఈ నెల 23న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే రైతు దీక్ష పోస్టర్‌ను జేఏసీ, రైతు జేఏసీ నేతలతో కలసి సోమవారం ఆయన ఆవిష్కరించారు. కోదండరాం మాట్లాడుతూ సరళీకరణ విధానాలతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతును ఆదుకోవాలనే పట్టింపు ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

పారిశ్రామికాభివృద్ధికి సమాంతరంగా వ్యవసాయరంగానికి చేయూతనందించాలని సూచించారు. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసిన సమాజంలో అశాంతి, అస్థిరత తలెత్తుతాయని హెచ్చరించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై చేతివృత్తులు కూడా ఆధారపడి ఉన్నాయనే అంశాన్ని పాల కులు విస్మరిస్తున్నారని అన్నారు. చెరువుల్లోకి నీరు రావడంతో రైతులు గొర్రెలు కోసుకుంటూ, సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం చేస్తున్న వాదన సరైందికాదని కోదండరాం అన్నారు. నీళ్లు రావడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని,

ఆదాయం పెరగకుండా సంతోషం ఎక్కడిది?
రైతు అందాల్సిన ఆదాయం గురించి ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. నకిలీ విత్తనాలను అరికట్టి,  మేలైన విత్తనాలను అందించకుండా, సాగుకు అవసరమైన పెట్టుబడిని సమకూర్చకుండా, ఎరువులను సకాలంలో ఇవ్వకుండా, మార్కెట్‌లో దోపిడీని అరికట్టకుండా, ఆదాయం పెరగకుండా రైతు సంతోషంగా ఎలా ఉంటాడని కోదండరాం ప్రశ్నించారు. ప్రాధాన్యరంగమైన వ్యవసాయానికి ఒక విధానాన్ని, నకిలీ విత్తనాలను అరికట్టడానికి విత్తనచట్టాన్ని తీసుకురావడంలో ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో రైతుకు సగటున 94 వేల రూపాయల అప్పుందన్నారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.

 రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమీ లేవని విమర్శించారు. కావేరి, పయనీర్, మోన్‌శాంటో, నూజివీడు వంటి పెద్దపెద్ద కంపెనీలు నకిలీ విత్తనాల సరఫరా చేసినా కేసులు పెట్టడం లేదన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా ఒకరిద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే ఏటా రైతులు నష్టపోతారని ఆయన హెచ్చరించారు. విత్తనాలు, ఎరువుల్లో కల్తీ అతిపెద్ద కుంభకోణమని రైతు జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ జలపతిరావు విమర్శించారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకుంటే వ్యవసాయం దెబ్బతింటుందని హెచ్చరించారు. సమావేశంలో రైతు జేఏసీ నేతలు కన్నెగంటి రవి, పిట్టల రవీందర్, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)