amp pages | Sakshi

జెరూసలెం యాత్రకు సహకారం

Published on Sat, 12/23/2017 - 01:58

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రతి పౌరుడి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తోందన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా క్రైస్తవులతో, రంజాన్‌ సమయంలో ముస్లింలతో, బోనాలు, బతుకమ్మ సందర్భంగా హిందువులతో ఉత్సవాలు నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ప్రజలంతా కలిసిమెలిసి ఉంటేనే ప్రగతి సాధ్యమని చెప్పారు. క్రిస్మస్‌ పండుగ పురస్కరించుకుని శుక్రవారం నిజాం కాలేజీ మైదానంలో క్రైస్తవ మత పెద్దలు, ప్రముఖులకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద క్రైస్తవ కుటుంబాలకు వస్త్రాలను పంపిణీ చేశారు.

అనంతరం క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేసి సభికులనుద్దేశించి మాట్లాడారు. ‘‘రాజధాని నగరంలో క్రైస్తవ భవన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ భవన నిర్మాణం నా కల. వచ్చే క్రిస్మస్‌ కల్లా ఆ భవనాన్ని కచ్చితంగా నిర్మించి తీరుతాం. ఇక్కడున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రత్యేకంగా సూచిస్తున్నా. అంతేకాకుండా ఈ భవన నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై స్వయంగా పరిశీలిస్తా. క్రైస్తవులకు పవిత్ర స్థలమైన జెరూసలెం వెళ్లేందుకు ప్రభుత్వం తరఫున సహకారం ఇవ్వాలని కొందరు క్రైస్తవ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు నన్ను చాలాసార్లు అడిగారు. తప్పకుండా వారి కోరిక తీరుస్తా. అతి త్వరలో ఈ పథకానికి సంబంధించిన పాలసీ ప్రకటిస్తా. చర్చిల మరమ్మతులు, కొత్త చర్చిల నిర్మాణానికి సంబంధించి మా ఎమ్మెల్యేలు, ఎంపీలు నా వద్ద వందకుపైగా ప్రతిపాదనలు తెచ్చారు. వాటిని పూర్తి చేయడానికి రూ.10 కోట్ల వరకు ఖర్చవుతాయని అంచనా. తప్పకుండా ఆ దరఖాస్తులను పరిశీలించి నిధులు మంజూరు చేస్తా. అవేగాకుండా కొత్తగా వచ్చే దరఖాస్తులను సైతం వీలైనంత త్వరలో పరిశీలించి నిధులు మంజూరు చేస్తా. గతంలో చర్చిలపై దాడులు జరుగుతున్నాయనే ఆందోళన ఉండేది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆందోళన లేదని, మూడేళ్లుగా ఎలాంటి దాడులు జరగడం లేదని చాలామంది పాస్టర్లు, బిషప్‌లు చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది’’అంటూ సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వికృతంగా రాజకీయాలు
రాష్ట్రంలో రాజకీయాలు వికృత రూపం దాల్చాయని సీఎం వ్యాఖ్యానించారు. ‘‘ప్రతిపక్ష పార్టీలంటే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవాలి. కానీ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం బాధాకరం. రాష్ట్రంలో ఇలాంటి విచిత్ర పరిస్థితి నెలకొనడం బాధగా ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులపై 196 కేసులు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు, గ్రీన్‌ ట్రిబ్యునల్‌ నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారు. క్రైస్తవ భవన్‌పైనా ఇలాంటి ఇబ్బందులే వచ్చాయి. అయినా ఆ భవనాన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి వచ్చే పండుగకల్లా ప్రారంభిస్తాం. పండుగ పూట వస్త్రాలు, గిఫ్ట్‌ల పంపిణీని తక్కువగా చూడొద్దు. గిఫ్ట్‌ ప్యాక్‌లో ఉన్న కానుకను ఆర్థిక విలువతో చూడొద్దు. పేదవాడి కోణంలో చూడాలి. పండుగ పూట పేదవాడు సైతం ఆనందంగా ఉండాలని, ప్రభుత్వం వారికి అండగా ఉందన్న భరోసా ఇవ్వడానికి వాటిని పంపిణీ చేస్తున్నాం’’అని అన్నారు.

 ‘‘జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ త్వరలో హైదరాబాద్‌కు రానున్నారు. పర్యాటక అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు. ఆమె ఉదయమే ఫోన్‌లో మాట్లాడారు. ‘ముస్లిం ముఖ్యమంత్రినైన నేను మా రాష్ట్రంలో రంజాన్‌ వేడుకలు ప్రభుత్వం తరఫున నిర్వహించలేదు. కానీ మీరు మాత్రం తెలంగాణలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’అని ఆమె అన్నారు. ఈ మాటలతో నాకు చాలా సంతోషం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల దేశమంతా ఇదే అభిప్రాయం ఉండాలని కోరుకున్నా’’అని సీఎం వివరించారు. రాష్ట్రంలోని 70 శాతం ప్రజలకు తాగునీరు ఇచ్చే కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు వచ్చాయని, ఈ సాయంత్రమే సమాచారం వచ్చిందని తెలిపారు. త్వరలో హరిత తెలంగాణను చూడనున్నారని, రాష్ట్ర ప్రజల కల సాకారం కానుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్, న్యూ ఇయర్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విశిష్ట సేవలందించిన క్రైస్తవులు, సంస్థలకు సీఎం అవార్డులు అందించారు.

Videos

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)