amp pages | Sakshi

సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయ్

Published on Sun, 08/02/2015 - 23:21

పేదలను రోడ్డున పడేసి పెద్దలను అందలమెక్కిస్తారా..
ఇళ్లను కూల్చివేస్తే కట్టుబట్టలతో ఎక్కడికి పోతారు?
ప్రజలు తిరగబ డాల్సిన సమయం ఆసన్నమైంది
కే సీఆర్ ప్రభుత్వంపైఅఖిలపక్ష నాయకుల ధ్వజం

 
జవహర్‌నగర్: అధికారం ఉంది కదా అని నియంతృత్వంగా వ్యవహరిస్తున్న టీఆర్‌ఎస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. జవహర్‌నగర్‌లో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం ఇటీవల కూల్చివేయడంతో అఖిలపక్ష నాయకులు ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పేదల ఇళ్లను కూల్చి ఆ స్థలాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు టీఆర్‌ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పేదల ఉసురు తీస్తున్న ప్రభుత్వంపై ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ (చంద్రన్న వర్గం) నేత కే గోవర్ధన్ మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం పట్నానికి వచ్చి కాయకష్టం చేసుకుని నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేస్తే కట్టు బట్టలతో వారు ఎక్కడికి పోవాలో ముఖ్యమంత్రి కేసీఆరే సమాధానమివ్వాలన్నారు. ప్రభుత్వ భూమిలో పక్కా ఇళ్లు నిర్మించుకున్న నిరుపేదలకు చట్టబద్ధంగా పట్టా పొందే హక్కు ఉందని స్పష్టంచేశారు.

తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు రాములు మాట్లాడుతూ.. వేల ఎకరాలు కబ్జా చేసిన వారిని వదిలి.. పేదల గుడిసెలను తొలగించడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ మాట్లాడుతూ పేదలకు అన్యాయం జరిగితే సహించేదిలేదని, వారందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేసే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. జనశక్తి  నేత చంద్రన్న మాట్లాడుతూ.. కేసీఆర్ తన ఏడాది పాలనలో కేవలం పేద ప్రజలపై ప్రతాపం చూపేందుకే సరిపోయిందన్నారు. అనంతరం.. ప్రభుత్వం తన ఇంటిని సైతం కూల్చివేస్తుందేమోనని ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి చెందిన జవహర్‌నగర్  గిరిప్రసాద్‌నగర్ కాలనీలోని ఆర్‌ఎంపీ వైద్యుడు రమేష్ (49) కుటుంబాన్ని అఖిలపక్ష నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
   ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాల మల్లేష్, పీఓడబ్ల్యూ నగర నాయకులు జీ అనురాధ, ఎ. నరేందర్, కే వెంకటేశ్వర్లు, జయసుధ, యాదమ్మ, పుణ్యవతి, ఇఫ్టూ నాయకులు మణి, నరసింహ, పోచయ్య, టీడీపీ జవహర్‌నగర్ అధ్యక్షుడు కుతాడి రవీందర్, జవహర్‌నగర్ ఫేజ్-1 అధ్యక్షుడు కాయిత రాజు యాదవ్, తెలంగాణ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ఇమ్మానుయేల్, బీఎస్పీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడ  రవి, కాంగ్రెస్ నాయకులు మహేందర్‌రెడ్డి, సదానంద్, ప్రసాద్ గౌడ్, బల్లి శ్రీను, మంజుల, టీడీపీ నాయకులు పల్లె కృష్ణ గౌడ్, వేణు ముదిరాజ్‌లతో పాటు వివిధ  ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.  
 
 

Videos

ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్

అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?

స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?

మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా

రామోజీ రావుకు బొత్స సత్యనారాయణ స్ట్రాంగ్ కౌంటర్

మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే

ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప

సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప

Photos

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)