నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘కేసీఆర్’మొక్క నరికివేత
Published on Fri, 11/23/2018 - 02:11
అల్గునూర్ (మానకొండూర్): మొదటి విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కరకట్ట దిగువన నాటిన మొక్కను గుర్తుతెలియని వ్యక్తులు నరికివేశారు. మూడేళ్లలో మొక్క పెద్దగా పెరిగి చెట్టయింది. బుధవారం రాత్రి వరకు బాగానే ఉన్న చెట్టు గురువారం ఉదయం నరికి ఉండగా.. దాని సమీపంలోనే వినాయకుడి ప్రతిమ కనిపించింది.
సమీపంలోని ఇతర చెట్లను కూడా నరికివేశారు. దీంతో కావాలనే కొందరు ఇలా చెట్టును నరికి వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకుంటామన్నారు.
#
Tags