నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎస్సీ వర్గీకరణ: ప్రధాని వద్దకు అఖిలపక్షం
Published on Fri, 02/03/2017 - 18:31
ఎస్సీ వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం తక్షణం చేపట్టాలని కోరుతూ అఖిలపక్ష బృందాన్ని ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రంగం సిద్ధం చేశారు. ఇందుకోసం ఈనెల 6వ తేదీన ఆయన ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ తెలంగాణ అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేశామని, వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కాబట్టి కేంద్రాన్ని కూడా ఈ విషయమై వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా కోరాలని కేసీఆర్ నిర్ణయించారు.
ప్రధాని అపాయింట్మెంట్ దొరకడంతో.. కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ, ఎంఐఎం నేతలకు ఆయన లేఖలు రాశారు. ఈనెల ఐదో తేదీకల్లా ఆయా పార్టీల నాయకులు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని ఆ లేఖలో కోరారు. ఐదో తేదీన ఢిల్లీ వెళ్తున్న కేసీఆర్.. అక్కడ విస్తృతంగా పలువురితో భేటీ అవుతారు. కాగా ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని గతంలోనే కేసీఆర్ ప్రకటించారు. ఇప్పుడు దానికి అనుగుణంగానే ఆయన ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని మరీ అందరినీ తీసుకెళ్తున్నారు. ప్రధానితో సమావేశమైనప్పుడు.. అసెంబ్లీలో చేసిన ఏకగ్రీవ తీర్మానం కాపీని కూడా ఆయనకు ఇవ్వాలని నిర్ణయించారు.
#
Tags