amp pages | Sakshi

ఆగుతూ.. సాగుతూ.. 

Published on Sat, 06/02/2018 - 14:55

డయాలసిస్‌ బాధితులకు రక్తశుద్ధి ఆగుతూ.. సాగుతోంది. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలిగితే జిల్లాలోని రెండు డయాలసిస్‌ కేంద్రాలూ పనిచేయడం లేదు. జనరేటర్లు లేకపోవడంతో రక్తశుద్ధి గంటల తరబడి నిలిచిపోతోంది. దీంతో రోగులు అవస్థ పడుతున్నారు. దీనికితోడు నెఫ్రాలజిస్ట్‌ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. స్టాఫ్‌ నర్సు, ల్యాబ్‌ టెక్నీషియన్లే డయాలసిస్‌ చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్లే పర్యవేక్షిస్తున్నారు.  

కొత్తగూడెంరూరల్‌ : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి, భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఒక్కోటి చొప్పున రెండు డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందుకోసం రూ.1.2 కోట్లు వెచ్చించింది. ఇవి కిడ్నీలు పనిచేయని వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో హైదరాబాద్‌ వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి, వారానికి మూడు సార్లు డయాలసిస్‌ చేయించుకునేవారు. ఇక్కడ ఏర్పాటు చేశాక వ్యయప్రయాసలు తగ్గిపోయాయి. కానీ వైద్యనిపుణులను నియమించకపోవడం, మౌలిక సదుపాయాలను కల్పించకపోవడంతో బాధితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.  

కొత్తగూడెంలో..  
గత నెల 12న కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్‌ కేంద్రం ప్రారంభించారు. 4 నెగిటివ్‌ బెడ్స్, మరొకటి పాజిటివ్‌ బెడ్‌ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు రోజు 20 మంది పేషెంట్‌ల వరకు డయాలసిస్‌ కోసం వస్తున్నారు. కానీ ఇక్కడ నెఫ్రాలజిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో స్టాఫ్‌ నర్సులు, టెక్నీషియన్లే రక్తశుద్ధి ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పేషెంట్‌కు ఏదైనా 

జరిగితే ఏంటి పరిస్థితని బాధితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆయా పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక పేషెంట్‌కు నాలుగు గంటల వరకు రక్తశుద్ధి చేస్తారు. ఇలా 24 గంటల వరకు ఆరుగురికి, మొత్తం నాలుగు బెడ్స్‌లో రోజుకు 24 మందికి రక్తశుద్ధి చేస్తారు. కేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు రోజుకు సుమారు 20 మంది చొప్పున 515 మంది డయాలసిస్‌ చేయించుకున్నారు.  

కరెంటు పోతే ఇబ్బందులే.. 
ఆస్పత్రికి జనరేటర్‌ ఉన్నా డయాలసిస్‌ కేంద్రానికి ప్రత్యేకంగా జనరేటర్‌ సౌకర్యం లేదు. ఎక్కువ సమయం కరెంటు పోతే డయాలసిస్‌ను మధ్యలోనే నిలిపివేస్తున్నారు. మళ్లీ కరెంటు వచ్చినా తర్వాత రక్తశుద్ధిని కొనసాగిస్తున్నారు. వేసవి కాలం నేపథ్యంలో తరచూ కరెంటు పోతుండటం వల్ల రక్త శుద్ధి ఆగిపోతోంది. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.  

భద్రాచలంలో.. 
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 3న డయాలసిస్‌ కేంద్రం ప్రారంభించారు. ఇప్పటి వరకు 171 మందికి రక్తశుద్ధి చేశారు. కేంద్రంలో ఆయాల పోస్టు ఖాళీగా ఉన్నాయి. జనరేటర్‌ సౌకర్యం లేదు. కరెంటు పోతే రోగులు ఇబ్బందులు పడక తప్పదు. నెఫ్రాలజిస్టు కూడా లేరు. రోజుకు మూడు షిఫ్టుల చొప్పున ఒక్కో షిఫ్టునకు ఒక టెక్నీషియన్, ఒక స్టాఫ్‌ నర్స్‌.. మొత్తం ఆరుగురు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డయాలసిస్‌ కేంద్రాలకు ప్రత్యేకంగా జనరేటర్‌తోపాటు, నెఫ్రాలజిస్ట్‌ పోస్టులను నియమించాలని పలువురు కోరుతున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)