amp pages | Sakshi

‘కారు’లోనే  కొండా దంపతులు

Published on Mon, 09/17/2018 - 11:15

సాక్షిప్రతినిధి, వరంగల్‌: కొండా దంపతులను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగించేందుకు అధిష్టానం వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. పార్టీలో వారికి జరిగిన అవమానాన్ని సరిదిద్దేందుకు స్వయంగా గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగంలోకి దిగినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. కొండా దంపతులతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపేందుకు కేసీఆర్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే గణపతి నవరాత్రులను కొండా దంపతులు తమకు కీడుదినాలుగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు వాళ్లు గడపదాటి బయటికి రారు. ఎలాంటి  కార్యక్రమాల్లోనూ పాల్గొనరు. ఈ నేపథ్యంలో నవరాత్రులు ముగిసిన అనంతరం వాళ్లు నేరుగా కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 105 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేసి, వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో సురేఖ అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. దీన్ని అవమానంగా భావించిన కొండా దంపతులు హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. తన టికెట్‌ పెండింగ్‌ పెట్టడానికి కారణాలు ఏమిటో రెండు రోజుల్లోగా చెప్పాలని, లేదంటే బహిరంగ లేఖ రాసి టీఆర్‌ఎస్‌ను వీడుతానని అల్టిమేటం జారీ చేశారు. అనంతరం ఓ కీలక నేత ఫోన్‌ చేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, మీ విషయంలో కేసీఆర్‌ సానుకూల దృకృథంతో ఉన్నారని అంతా మంచే జరుగుతుందని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖ బహిరంగ లేఖను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఈలోగా గణపతి నవరాత్రులు రావడంతో వాళ్లు నిష్క్రియాశీలనలోకి వెళ్లిపోయారు.

 ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలంటే ఉమ్మడి వరంగల్‌ జిల్లా అత్యంత కీలకమని పార్టీ అధిష్టానం భావిస్తోంది. చిన్నచిన్న కారణాలతో ఇక్కడే ఒకటి, రెండు సీట్లను కోల్పోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతికూల ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్సీ వర్గాలు హెచ్చరించినట్లు తెలిసింది. కొండా దంపతులు వరంగల్‌ తూర్పు, పశ్చిమ, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలను ప్రత్యక్షంగా, మరో మూడు నియోజకవర్గాలను పరోక్షంగా ప్రభావితం చేయగలరని ఇంటెలిజెన్సీ వర్గాలు గులాబీ దళపతికి నివేదికలు అందించినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన కేసీఆర్‌ ఇప్పటికే కొండా మురళితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది.

మీ రాజకీయ భవిష్యత్‌ను తనకు వదిలేసి జిల్లాలో పార్టీ కోసం పనిచేయాలని సూచించినటుŠల్‌ తెలుస్తోంది. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంతోపాటు మరో నియోజకవర్గంలో టికెట్‌ ఇచ్చే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మళ్లీ అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని, ఒకవేళ రెండో టికెట్‌ ఇవ్వలేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సీఎం మాటలతో పునరాలోచనలో పడిన కొండా దంపతులు ఈ తొమ్మిది రోజుల్లో ఆలోచన చేసి, నవరాత్రుల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)