రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా
Published on Wed, 06/12/2019 - 08:38
శ్రీరంగాపూర్: మండలంలోని వెంకటాపూర్లో మంగళవారం ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి(22) ఇదే గ్రామానికి చెందిన పరశురాముడు(30) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన కులపెద్దలు కులం, గోత్రం ఇద్దరివి ఒకటే కావడంతో వరుసలు కలువదని, ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని ఒప్పంద పత్రాలు రాసుకున్నారు.
అనంతరం యువతికి మరొకరితో పెళ్లి కూడా చేశారు. కానీ ప్రియుడిపై ప్రేమతో పెళ్లయిన కొద్ది రోజులకే భర్తను వదిలి యువతి పుట్టింటికి వచ్చింది. ప్రస్తుతం పరశురాముడు మరో యువతితో పెళ్లికి సిద్ధపడడంతో తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు 24 గంటల్లో న్యాయం చేయకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని హెచ్చరించింది.
#
Tags