లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు
Breaking News
ఎస్పీ.. మురిపెం!
Published on Thu, 09/28/2017 - 07:19
మహబూబ్నగర్ క్రైం : బతుకమ్మ సంబరాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో బుధవారం రాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పరేడ్ మైదానంలో సురక్షా బతుకమ్మను ప్రత్యేకంగా ప్రతిష్టించారు. ఎస్పీ బి.అనురాధ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మను తలపై పెట్టుకోని పరేడ్మైదానికి చేరుకుని అక్కడి భారీ బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మహిళా పోలీసు సిబ్బందితో పాటు పోలీసు అధికారుల కుటుంబ సభ్యులతో ఆమె బతుకమ్మతో పాటు కోలాటం ఆడారు. అనంతరం ఎస్పీ అనురాధ మాట్లాడుతూ ఉత్సాహపూరిత వాతావరణాన్ని పెంపొందించే జానపద పాటలు, తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ అని పేర్కొన్నారు.
జిల్లా కోర్టులో
మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి జి.వెంకట కృష్ణయ్య, మహిళ న్యాయమూర్తులు రాధాదేవి, క్షమాదేష్ పాండే హాజరై బతుకమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత మహిళ న్యాయవాదులతో కలిసి బతుకమ్మ ఆడారు. న్యాయమూర్తి ప్రభాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి, కార్యదర్శి గడ్డం గోపాల్, న్యాయవాదులు విక్రం, నర్సింహారెడ్డి, ఉమామహేశ్వరి, మాధురి, రాణి, అరుణ, విజయలక్ష్మి, రాధ పాల్గొన్నారు.
Tags