amp pages | Sakshi

‘ఆ బృందం క్రేజీ ఆఫర్‌ దక్కించుకుంది’

Published on Wed, 09/11/2019 - 18:22

సాక్షి, హైదరాబాద్‌ : ఇంజనీరింగ్‌ విద్యార్థుల ప్రతిభకు పట్టం కట్టేందుకు ‘నేషనల్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ సింపోజియం’ పేరిట తాము నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైందని మహీంద్ర ఎకోలే సెంట్రల్‌(ఎంఈసీ) ఇంజనీరింగ్‌ విద్యా సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 300కు పైగా విద్యార్థులు హాజరయ్యారని పేర్కొంది. ఇందులో భాగంగా పరిశోధనా విభాగానికి సంబంధించి 12 మౌఖిక, 30 పోస్టర్లను విద్యార్థులు సమర్పించారని తెలిపింది. వివిధ విభాగాల్లో గెలుపొందిన విద్యార్థులకు 65 వేల రూపాయల విలువైన బహుమతులు అందజేసినట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత ప్రొఫెసర్‌ అజయ్‌ ఘటక్‌, సైబర్‌ భద్రతా విభాగం సీఈఓ డాక్టర్‌ శ్రీరామ్‌ బిరుదవోలు ముఖ్య అతిథులుగా హాజరై... స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌ నాయకత్వాల గురించి విద్యార్థులకు వివరించినట్లు పేర్కొంది.

నేషనల్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ రీసెర్చ్‌ సింపోజియం’ లో భాగంగా టెక్ మహీంద్ర మెషీన్ లెర్నింగ్‌తో కలిసి ఎంఈసీ క్లబ్‌ ఎనిగ్మా12 గంటల కోడింగ్‌ ఛాలెంజ్‌ను నిర్వహించినట్లు ఎంఈసీ తెలిపింది. అదే విధంగా స్టార్టప్‌ ఐడియా కాంటెస్ట్‌ కూడా నిర్వహించామని..ఈ పోటీకి పారిశ్రామికవేత్తలు డాక్టర్‌ ఎ.శ్రీనివాస్‌(ఏఐపీఈఆర్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌), రాఘవేంద్ర ప్రసాద్‌(ఫారిగేట్‌ అడ్వైజరీ సొల్యూషన్స్‌ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్‌), శ్రీచరణ్‌ లక్కరాజు(స్టమాజ్‌ సీఈఓ) న్యాయ నిర్ణేతలుగావ్యవహరించారని పేర్కొంది. ఈ పోటీలో గెలుపొందిన ఓ విద్యార్థి బృందం.. స్టార్టప్‌ పెట్టుబడులకై జడ్జీల నుంచి ఆఫర్‌ను సైతం సొంతం చేసుకుందని వెల్లడించింది.

 

అదే విధంగా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన డిజైన్‌ అండ్‌ ప్రొటోటైప్‌ కాంటెస్ట్‌లో 12 బృందాలు పాల్గొన్నాయని వెల్లడించింది. ఈ కార్యక్రమం గురించి ఎంఈసీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ యాజులు మెడ్యూరీ మాట్లాడుతూ..‘2018లో నిర్వహించిన సింపోజియంకు మంచి ఆదరణ లభించింది. అందుకే ఈసారి జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించాం. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించనున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాలు యువ పారిశ్రామికవేత్తలను వెలికితీసేందుకు దోహదపడతాయి’ అని పేర్కొన్నారు. కాగా మహీంద్ర గ్రూప్‌లో భాగమైన అంతర్జాతీయ కళాశాల ఎంఈసీని మహీంద్ర యాజమాన్యం 2013లో హైదరాబాద్‌లో నెలకొల్పిన సంగతి తెలిసిందే.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)