అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ..
Published on Sun, 03/19/2017 - 04:15
కాగజ్నగర్ టౌన్: పదో తరగతి పరీక్ష ఒకరికి బదులుగా మరొకరు రాస్తూ దొరికిపోయిన సంఘటన శనివారం కాగజ్నగర్లో వెలుగు చూసింది. పట్టణంలోని ఆర్ఆర్వో కాలనీలో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కేంద్రంలో కరీం తెలుగు పరీక్ష రాయాల్సి ఉంది. గతంలో తెలుగు పరీక్షలో ఫెయిల్ అయినందున ఆయన మరోసారి ఈ పరీక్ష రాయాల్సి ఉంది.
అయితే, అతనికి బదులుగా అతని సన్నిహితుడు బీకాం చదివిన జమీర్ శనివారం తెలుగు రెండో పేపర్ రాస్తుండగా సీఎస్ దేవాజీ పట్టుకున్నారు. శుక్రవారం మొదటి పేపర్ సైతం జమీరే రాసినట్లు తెలిసింది. పోలీసులు జమీర్ను అదుపులోకి తీసుకున్నారు. జమీర్తో పాటు కరీం.. ఇన్విజిలేటర్, సిట్టింగ్ స్క్వాడ్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మజీద్ తెలిపారు.
#
Tags