వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
నడిరోడ్డు మీద భార్యపై కత్తితో దాడి
Published on Wed, 10/22/2014 - 11:30
నిజామాబాద్లో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ భర్త ఆమెను అంతం చేయాలనుకున్నాడు. పూటుగా తాగి.. నడిరోడ్డు మీదే కత్తితో ఆమెపై దాడి చేశాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు నడిరోడ్డుపై పరుగులు తీసింది. ఏ దారీ కనపడక.. కాల్వలో దూకేసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కవిత, నర్సింహులు భార్యాభర్తలు. పెళ్లైన దగ్గర్నుంచి నర్సింహులుకి భార్యపై అనుమానం జబ్బుపట్టుకుంది. నిత్యం తాగివచ్చి ఆమెను వేధించేవాడు. ఈ నేపథ్యంలో మద్యం తాగి వచ్చి భార్యపై కత్తితో దాడి చేశాడు. పరుగులు తీసిన కవిత కాలనీలోని కాల్వలో దూకేసింది. ప్రాణాలు కాపాడిన స్ధానికులు ఆసుపత్రిలో చేర్చారు. తలకు తీవ్ర గాయాలతో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలిసిన మహిళా సంఘాలు కవితకు మద్దతు పలికాయి. నర్సింహలును కఠినంగా శిక్షించాలని మహిళాసంఘ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Tags