వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బాలింత మృతిపై బంధువుల ఆందోళన
Published on Thu, 07/02/2015 - 16:20
- ప్రైవేటు ఆస్పత్రిపై దాడి..రాస్తారోకో
కరీంనగర్: కరీంనగర్ జిల్లా మెట్పల్లిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు రోజుల బాలింత గురువారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలింత మృతిచెందిందని ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆస్పత్రిపై దాడి చేయడంతో పాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. వివరాలు..మెట్పల్లికి చెందిన ఆకుల లాస్య ప్రసవం నిమిత్తం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. నాలుగు రోజుల కింద కాన్పు కావడంతో ఆమె ఆస్పత్రిలోనే ఉంటోంది. అయితే ఆమె గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా మృతిచెందింది.
దాంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు లాస్య మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని భావించి ఆస్పత్రిపై దాడిచేశారు. అనంతరం జాతీయ రహదారిపై రాస్తారాకో చేశారు. పోలీసులు వచ్చి ఆందోళకారులను శాంతింపజేశారు.
#
Tags