అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జాతి భేదాన్ని మరిచి..
Published on Sun, 03/15/2020 - 08:57
సాక్షి, నాగార్జునసాగర్ : జాతి భేదాన్ని మరిచి గేదెలతో కోతి సహవాసం చేస్తూ జీవనం సాగిస్తుంది. మండలంలోని పోతునూరు గ్రామానికి చెందిన యాసాల వెంకటేశ్వర్రావు ఇంట్లోకి రెండు నెలల క్రితం కోతి పిల్ల వచ్చింది. అది ఇంటి పరిసరాలలోనే ఉంటూ గేదెలతో సహవాసం చేస్తూ వాటితో మమేకమైపోయింది. ఇలా పది రోజుల తర్వాత యజమాని వెంకటేశ్వర్రావు పశుగ్రాసం కోసం గేదెలను మేపడానికి వ్యవసాయ పొలాలకు తోలుకుపోతున్నా కోతి గేదెపై ఎక్కి వాటి వెంటే వచ్చింది. అప్పటి నుంచి రాత్రి సమయంలో ఇంటి ఆవరణలోని వేపచెట్టుపై నిద్రించటం, ఉదయం గేదెల వెంట పొలాలకు వెళ్లడం పరిపాటిగా మారింది. కోతిని గేదెలు కూడా ఏమీ అనడం లేదు. వెంకటేశ్వర్రావు కుటుంబ సభ్యులు కూడా కోతికి తినుబండారాలు ఇచ్చి ఆదరిస్తున్నారు.
#
Tags