రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉధృతమైన రుతుపవనాలు
Published on Mon, 06/15/2015 - 03:46
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ఉధృతంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు కూడా ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ డెరైక్టర్ వైకే రెడ్డి చెప్పారు. రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని ఆయన పేర్కొన్నారు.
కాగా, ఆదివారం అధికంగా ఖమ్మం జిల్లా మణుగూరులో 9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇల్లెందులో 7 సెం.మీ, గూడూరు, బయ్యారం, దుమ్ముగూడెం పలుచోట్ల 6 సెంటీమీటర్ల చొప్పున వర్షం నమోదైంది. వరంగల్ జిల్లా పాలకుర్తి, మహబూబాబాద్, నర్సంపేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది.
#
Tags