అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
కూతురితో సహా తల్లి ఆత్మాహుతి
Published on Tue, 05/12/2015 - 16:14
బిజినేపల్లి (మహబూబ్నగర్) : ఆర్థిక ఇబ్బందులు ఆ తల్లి మనసును కలచివేశాయి. మానసిక వికలాంగురాలైన 12 ఏళ్ల కుమార్తెపై కిరోసిన్ పోసి నిప్పటించడమే కాకుండా, తర్వాత తనపై కూడా కిరోసిన్ పోసుకుని నిప్పటించుకుంది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, అభం శుభం తెలియని ఆ బాలిక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణం మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలం శాయినిపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే... శాయినిపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మి, తిరుపతయ్యలు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. తిరుపతయ్య హైదరాబాద్లో జీవనం సాగిస్తుంటే, వరలక్ష్మి మాత్రం మానసిక వికలాంగురాలైన కుమార్తె అనురాధ(12), ఏడాది వయసున్న కుమారుడిని చూసుకుంటూ స్థానికంగానే ఉంటోంది. పెద్ద కుమార్తె వివాహం ఇటీవలే చేయడం, ఆర్థిక ఇబ్బందులతో జీవనం కష్టం కావడంతో వరలక్ష్మి మంగళవారం మధ్యాహ్నం ఇంటివద్దే ఆత్మాహుతియత్నానికి పాల్పడింది. కూతురు అనురాధతోపాటు తనపై కిరోసిన్ పోసుకుని నిప్పటించుకోగా, వరలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలపాలైన అనురాధను నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Tags