రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం
Published on Wed, 03/15/2017 - 01:31
మండల సభలో ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నం
మహబూబాబాద్ రూరల్: తమకు నిధులు కేటాయించడం లేదని ఆవేదనకు గురైన ఓ ఎంపీటీసీ సభ్యుడు మండల సర్వసభ్య సమావేశంలోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు.
మహబూబాబాద్ మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గోనె ఉమారాణి అధ్యక్షతన జరిగింది. సభ జరుగుతుండగా జంగిలిగొండ ఎంపీటీసీ సభ్యుడు బానోత్ బాలకృష్ణ ఒక్కసారిగా లేచి తమను పట్టించుకునే వారే లేరని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారే నిధులు వినియోగించుకోండి అంటూ బాటిల్లోని పెట్రోల్ ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు బాలకృష్ణ వద్ద నుంచి బాటిల్ను తీసుకుని అతడిని వారించి కూర్చోబెట్టారు.
#
Tags