వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి
Published on Tue, 08/11/2015 - 10:38
అర్వపల్లి: గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని గ్రామపంచాయతీ కార్మికుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బోయపల్లి వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్వపల్లిలో జరుగుతున్న సమ్మె శిబిరంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీలు కార్మికులతో 24గంటలు వెట్టిచాకిరి చేయించుకొని నెలకు వేతనం రెండు, మూడు వేలకు మించి ఇవ్వడం లేదన్నారు.
ప్రభుత్వ జీవోల ప్రకారం కనీస వేతనం నెలకు రూ. 15వేలు చెల్లించాలని కోరారు. సమ్మెపై ప్రభుత్వం నోరు మెదపక పోవడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఊట్కూరి భీముడు, కుంభం రాంమ్మూర్తి, సాయిని యాగానందం, కుంభం నాగరాజు, జె. వెంకన్న, బి. జలేందర్, శ్రీరాములు, పి. సైదులు, సోమనర్సయ్య, వీరయ్య, శ్రీరాములు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags