amp pages | Sakshi

పేరుకే రైల్వే స్టేషన్లు!

Published on Tue, 05/29/2018 - 06:59

తలమడుగు(బోథ్‌) : బోథ్‌ నియోజకవర్గంలో తలమడుగు, ఉండమ్‌ గ్రామంలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఈ రెండు స్టేషన్లు ప్యాసింజర్‌ రైళ్లకే పరిమితమయ్యాయి. ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు హాల్టింగ్‌ లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. గతంలో తాంసీ, తలమడుగు మండల ప్రజల రావాణా సౌకర్యార్థ్థం రైలు ప్రయాణం మాత్రమే ఉండేది. ఉండమ్, తలమడుగు రైల్వే స్టేషన్లను పాలకులు పట్టించుకోక పోవడంతో స్టేషన్లలో కనీస వసతులు కరువయ్యాయి. 

1976లో నుంచి అసౌకర్యాలే..
1976లో తలమడుగు గ్రామం మీదుగా మహరాష్ట్ర కిన్వాట్‌ మీదుగా రైల్వే లైన్‌ ఏర్పాటు చేశారు. బోథ్‌ నియోజకవర్గంలో బోథ్, నేరడిగొండ, బజార్‌హత్నూర్, ఇచ్చోడ, గుడిహత్నుర్, సిరికొండ, బీంపూర్, తాంసీ, తలమడుగు, మండలాలు ఉన్నాయి. వాటిలో తలమడుగు రైల్వే స్టేషన్‌ మాత్రం తాంసీ, తలమడుగు, భీంపూర్, మండలాల ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. మూడు మండలాలకు చెందిన ప్రజలు తరచూ హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈస్టేషన్‌ మీదుగా దీక్షభూమి, పాట్నా, నాందేడ్‌ స్పెషల్, నందిగామ్, కృçష్ణ, సంత్రగాంచి, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వెళ్తుంటాయి, కేవలం ప్యాసింజర్‌ రైళ్లు రెండు మాత్రమే ఇక్కడ అగుతాయి. బస్సు చార్జీలు ప్రయాణికులకు భారమవుతుండడంతో నిరుపేద, మధ్యతరతి ప్రజలు రైళ్లోనే ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇక్కడ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే వారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

పట్టించుకోని అధికారులు..
ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలని, రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపర్చాలని గతంలో పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ తలమడుగులోని రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. తాగునీటి వసతి, ప్రాయాణికులు కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎండాకాలం ఎండలో, వర్షాకాలంలో తడుస్తూ రైలు ప్రయాణం చేస్తున్నామని స్థానికులు వాపోతున్నారు. నిత్యం వందల సంఖ్యలో ప్రాయణికులు స్టేషన్‌ నుంచి ప్రాయాణం సాగిస్తున్నా అధికారులు వసతులు కల్పించడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆపకపోవడంతో జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి తిరిగి ఎక్స్‌ప్రెస్‌ రైలులో తలమడుగు, ఉండమ్, రైల్వే స్టేషన్ల మీదుగానే వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డబ్బులు, సమయం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఎంపీ గోడం నగేశ్‌ చొరవ తీసుకుని తలమడుగులో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని, ఉండమ్, తలమడుగు రైల్వే స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆపాలి
తలమడుగు రైల్వే స్టేషన్‌లో ప్యాసింజర్‌ రైళ్లు మాత్రమే అపుతున్నారు. మిగతా రైళ్లు ఇక్కడ ఆపడం లేదు. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఆక్కడి నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లి అక్కడి నుంచి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ రైళ్లు నిలిపితే ఎలాంటి సమస్యలు ఉండవు. గతంలో నాందేడ్, నుంచి రైల్వే ఉన్నధికారులు వచ్చి పరిశీలించి వెళ్లారు తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదు.    – లింగాల రాజన్న, తలమడుగు

కనీస సౌకర్యాలు కల్పించాలి
రైల్వె స్టేషన్‌లో ప్రాయాణికులకు కూర్చోడానికి కుర్చీలు తాగేందుకు నీటి సౌకర్యం లేవు. దీంతో ఇక్కడకు వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ కాలంలో ఎండను, వర్షాకాలంలో వానను తట్టుకుని ప్రయాణం చేస్తున్నాం. రైల్వే స్టేషన్‌కు రావాలంటే రోడ్డు పూర్తిగా బురదమయంగా ఉంటుంది. బురదలోంచి నడిచి వస్తున్నాం. కనీసం తాగునీటి సౌకర్యం, కనీస సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.      – శరత్‌యాదవ్, తాంసీ 

Videos

లండన్ కు చేరుకున్న సీఎం జగన్

వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?

తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం

థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

RCB vs CSK: ప్లే ఆఫ్స్‌ బెర్తుకై చావో రేవో

లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున

బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు

చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)