amp pages | Sakshi

ఓట్లాటలో..ముగిసిన మున్సిపోల్స్‌ నామినేషన్ల పర్వం

Published on Sat, 01/11/2020 - 09:59

సాక్షి,మేడ్చల్‌జిల్లా: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 640 డివిజన్లు, వార్డులకు మొత్తం 5,578 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన ఘట్టం ముగియడంతో కొందరు నేతలు ఓట్ల వేటలో పడగా, మరికొందరు రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు శనివారం పరిశీలిస్తారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా అన్ని వివరాలు సమర్పించిన అభ్యర్థుల నామినేషన్లే చెల్లుబాటవుతాయి. లేదంటే వాటిని తిరస్కరిస్తారు. చెల్లిన నామినేషన్ల వివరాలను ఇదే రోజు వెల్లడిస్తారు. తిరస్కరించిన వాటిపై 12వ తేదీన అభ్యంతరాలు స్వీకరించి.. 13న పరిష్కరిస్తారు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను  ఉపసంహరించుకోవచ్చు. తర్వాత తుది పోరులో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటించి వారికి గుర్తులు కేటాయిస్తారు. ముఖ్యమైన పోలింగ్‌ ఘట్టం ఈ నెల 22న ఉంటుంది. 

మేడ్చల్‌ జిల్లాలో ఇలా..
జిల్లాలోని నాలుగు నగరపాలక సంస్థల్లో 115 డివిజన్లకు 1,257 నామినేషన్లు అందగా, 9 మున్సిపాలిటీలపరిధిలోని 174 వార్డులకు 1,506 నామినేషన్లు దాఖలయ్యాయి. కార్పొరేషన్లయిన బోడుప్పల్‌లో 377, ఫీర్జాదిగూడ 252, జవహర్‌నగర్‌ 268, నిజాంపేట 340 నామినేషన్లు వచ్చాయి. పురపాలక సంఘాలైన దమ్మాయిపేటలో 117, నాగారం 174, పోచారం 129, ఘట్‌కేసర్‌ 151, తూముకుంట 151, కొంపల్లి 213, గుండ్లపోచంపల్లి 106, మేడ్చల్‌ 223, దుండిగల్‌లో 242 నామినేషన్లు అందాయి. 

అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో
రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల్లో మొత్తం 2,815 నామినేషన్లను అభ్యర్థుల నుంచి ఎన్నికల అధికారులు స్వీకరించారు. చివరి రోజు 2,176 అందడం విశేషం. జిల్లాలో మూడు కార్పొరేషన్ల పరిధిలో వంద డివిజన్లు ఉండగా.. వీటికి 818 నామినేషన్లు వచ్చాయి. అలాగే, 12 మున్సిపాలిటీల్లో 251 వార్డులకు 1,997 నామినేషన్లు అందాయి. ఆదిభట్లలో 123, ఇబ్రహీంపట్నం 138, తుర్కయాంజల్‌ 198, తుక్కుగూడ 135, పెద్ద అంబర్‌పేట 241, ఆమనగల్లు 117, శంషాబాద్‌ 208, నార్సింగి 159, మణికొండ 199, షాద్‌నగర్‌ 234, శంకర్‌పల్లి 107, జల్‌పల్లి 138 నామినేషన్లు దాఖలు చేశారు. కార్పొరేషన్ల విషయానికొస్తే బడంగ్‌పేటలో 289, బండ్లగూడ 210, మీర్‌పేట 319 నామినేషన్లు అందాయి. 

మూడు వార్డులు ఏకగ్రీవం  
దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు ఏకగ్రీవమైంది. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శంభీపూర్‌ కృష్ణ ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు తమ్ముడే కృష్ణ. కాగా దుండిగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జనరల్‌ మహిళకు రిజర్వు కాగా, శంభీపూర్‌ కృష్ణ సతీమణి కృష్ణవేణిని అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కృష్ణవేణి 25వ వార్డు నుంచి బరిలో ఉన్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో రెండు వార్డులకు ఒక్కొక్క నామినేషన్‌ చొప్పున వచ్చాయి. మున్సిపాలిటీలోని 17, 18 వార్డుల నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ వేసిన ముత్యాల ప్రసన్నలక్ష్మి, ఇందిరాల రమేష్‌ ఏకగ్రీమయ్యారు.

టీఆర్‌ఎస్‌లో రెబబ్స్‌ బెడద
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో రెబల్స్‌ బెడద తీవ్రంగా ఉంది. ఒకటి, రెండు మినహా మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు జనరల్‌ కేటగిరీకి రిజర్వు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మేడ్చల్‌ నియోజకవర్గంలోని ఫీర్జాదిగూడ కార్పొరేషన్‌లో 26 డివిజన్లు ఉండగా, టీఆర్‌ఎస్‌ నుంచి 100 నామినేషన్లు వేశారు. పోచారంలో 18 వార్డులుండగా, టీఆర్‌ఎస్‌ నుంచి 49 నామినేషన్లు, దమ్మాయిగూడలోని 18 వార్డులకు 37, నాగారంలో 20 వార్డులకు 55, ఘట్కేసర్‌ 18 వార్డుల్లో 77 నామినేషన్లు దాఖల య్యాయి. ఇదే పరిస్థితి నిజాంపేట్, బోడుప్పల్‌ కార్పొరేషన్లతో పాటు, కొంపల్లి, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, తూముకుంట తదితర మున్సిపాలిటీల్లోనూ ఉండడం మంత్రి, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారనుంది.

రంగారెడ్డి జిల్లాలో అంతే..
ఈ జిల్లాలో కూడా అధికార పార్టీకి రెబల్స్‌ బెడద తప్పటం లేదు. నగర శివారులో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉండటంతో పాటు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుతో వార్డుల్లో తీవ్ర పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. తుక్కుగూడ 7వ వార్డులో ఎనిమిది మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బండ్లగూడలో ఏకంగా టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ ఆరుగురు నేతలు కాంగ్రెస్, టీడీపీ తీర్థం పుచ్చుకుని బరిలోకి దిగారు. బడంగ్‌పేట్, మీర్‌పేట్‌ కార్పొరేషన్లు, శంకర్‌పల్లి, తుర్కయాంజల్, నార్సింగి, శంషాబాద్‌ మున్సిపాలిటీల్లోనూ టీఆర్‌ఎస్‌లో రెబల్స్‌ బెడద తీవ్రంగా ఉంది.  

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)