amp pages | Sakshi

ప్రజల అభ్యున్నతే టీఆర్‌ఎస్‌ లక్ష్యం 

Published on Tue, 10/23/2018 - 11:15

మొయినాబాద్‌ రూరల్‌(చేవెళ్ల): ప్రజల ప్రగతే టీఆర్‌ఎస్‌ లక్ష్యమని, ప్రజలకు అండగా ఉంటుందని మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మొయినాబాద్‌ మండల టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకుల సమావేశం ఆదివారం రాత్రి హిమయత్‌నగర్‌లో మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశంలో మంత్రి మహేందర్‌రెడ్డి  మాట్లాడుతూ  అనేక సంక్షేమ పథ«కాలతో బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధికి కేసీఆర్‌ ఎంతో కృషిచేశారని అన్నారు.

 కాలే యాదయ్యను గెలిపించేందుకు అందరూ కృషిచేయాలన్నారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్‌ఎస్‌   అధికారంలోకి వస్తుందని, టీఆర్‌ఎస్‌ విజయన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. మళ్లీ మంత్రిగా తానున ఉంటానని, చేవెళ్ల నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు కృషిచేస్తానని, గ్రామాలభివృద్ధికి అధిక నిధులు వెచ్చిస్తానని పేర్కొన్నారు. నాయకులు కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి కష్టపడి పనిచేస్తే పార్టీ అభ్యర్థి విజయం తథ్యమని అన్నారు.  వృద్ధులకు ఫించన్లు, షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, రైతు బంధు, పెట్టుబడి సహాయం గ్రామీణ రోడ్లు అభివృద్ధి, ఇంటింటికి నల్లా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంత్‌రెడ్డి, జిల్లా మత్స్యకార్మిక సంఘం కార్యవర్గ సభ్యుడు వెంకటపూర్‌ బాల్‌రాజ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ శ్రీహరియాదవ్, పీఏసీఏస్‌ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మంగలి పెంటయ్య, డప్పు ఆనంద్, యాదయ్య, నాయకులు గుండుగోపాల్, పాండుగౌడ్, మంగలి రాములు, అద్వాని, అలకుంట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)