amp pages | Sakshi

ఇక వాస్తవిక వేతనం ఆధారంగా పింఛన్‌

Published on Fri, 04/05/2019 - 01:14

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: ఎలాంటి గరిష్ట పరిమితి లేకుండా ఉద్యోగులు పదవీవిరమణ సమయానికి పొందుతున్న వాస్తవిక మూలవేతనం, డీఏ ఆధారంగా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌వో) ఖాతాదారులందరికీ పింఛన్‌ దక్కనుంది. ఈమేరకు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఈపీఎఫ్‌వో తాజాగా నూతన విధానం రూపొందించనుంది. పింఛను లెక్కించేందుకు గరిష్ట పరిమితి విధానం కాకుండా పూర్తి వేతనాన్ని (చివరి మూల వేతనం, డీఏ) పరిగణనలోకి తీసుకోవాలంటూ.. గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈపీఎఫ్‌ఓ దాఖలు చేసిన పిటిషన్‌ను.. సుప్రీంకోర్టు ఈనెల ఒకటో తేదీన తోసిపుచ్చింది. ఈపీఎఫ్‌వో దాఖలు చేసిన పిటిషన్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేవీ లేవని చెబుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ప్రైవేటురంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు పదవీ విరమణ పొందే సమయంలో తీసుకునే మూలవేతనం, డీఏ ఆధారంగా íపింఛన్‌ పొందే అవకాశం లభించింది.

పింఛన్‌ లెక్కింపు ఇలా!
ఇకపై ఉద్యోగి వాస్తవిక మూలవేతనం, డీఏను ఆధారంగా íపింఛన్‌ లెక్కిస్తారు. ఉద్యోగి సర్వీసును పరిగణనలోకి తీసుకుని నిర్ణీత ఫార్ములా ప్రకారం దీన్ని ఖరారు చేస్తారు. ఇప్పటివరకు ఈపీఎఫ్‌వో ఉద్యోగికి వేతనం ఎంత ఉన్నా పింఛన్‌ లెక్కించేందుకు గరిష్ట పరిమితి విధించింది. 2014 సెప్టెంబరు వరకు ఈ పరిమితి రూ.6,500గా ఉండేది. ఆ తదుపరి గరిష్ట పరిమితిని రూ.15 వేలకు పెంచింది. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. 2014 సెప్టెంబరు కంటే ముందుగా పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు చివరి వాస్తవిక వేతనం ఆధారంగానే పింఛన్‌ పొందేందుకు అర్హత ఉంది. అయితే తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా 2014 తరువాత పదవీ విరమణ చేసే ఉద్యోగులకూ ఈ సూత్రం వర్తించనుంది. ఈ కారణంగా పదవీ విరమణ అనంతరం íపింఛన్‌ గణనీయంగా పెరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈపీఎఫ్‌వో కొత్త పింఛన్‌ విధానాన్ని రూపొందించాల్సి ఉంది. ఈమేరకు ఈపీఎఫ్‌ఓ మార్గదర్శకాలను విడుదల చేయాలి. వాటి ప్రకారం కొత్త విధానం అమల్లోకి వస్తుంది.

ఇలా పెరుగుతుంది!
ఇప్పటి వరకు గరిష్ట పరిమితి, సర్వీసు గుణించి దానిని 70తో భాగించడం ద్వారా పింఛన్‌ లెక్కించేవారు. అంటే గరిష్ట పరిమితి అయిన రూ.15 వేలను సర్వీసుతో గుణించి 70తో భాగించే వారు. 20ఏళ్ల సర్వీసు ఉంటే రూ.4,285గా లెక్కించేవారు. కానీ ఇకపై రూ.15 వేలు కాకుండా వాస్తవ వేతనం ఆధారంగా.. అంటే పదవీవిరమణ పొందే సమయంలో వాస్తవిక మూలవేతనం, డీఏ కలిపి రూ.40 వేలు, సర్వీసు 20ఏళ్లు ఉంటే రూ.11,428 చొప్పున íపింఛన్‌ లభిస్తుంది. మూలవేతనం, డీఏ, సర్వీసు పెరిగే కొద్దీ పదవీవిరమణ అనంతరం వచ్చే పింఛన్‌ పెరుగుతుంది.

ఈపీఎస్‌ సర్దుబాటు ఎలా?
ఉద్యోగులు మూలవేతనం, డీఏలో 12% తమవంతు వాటాగా ఈపీఎఫ్‌కు చెల్లిస్తారు. అంతేమొత్తాన్ని ఈ ఖాతాకు యాజమాన్యం జతచేస్తుంది.  యాజమాన్యం జమ చేసే 12% లో 8.33% íపింఛన్‌ పథకానికి (ఈపీఎస్‌) వెళ్తుంది. మిగిలిన సొమ్ము పీఎఫ్‌ ఖాతాకు వెళుతుంది. అంటే ఉద్యోగి రూ.1,800 చెల్లిస్తాడనుకుంటే.. యాజమాన్యం చెల్లించే రూ.1,800లో రూ.1,250 ఈపీఎస్‌కు, రూ.550 పీఎఫ్‌ ఖాతాకు వెళుతుంది. తాజా గా సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈపీఎస్‌కు వెళ్లే మొత్తం పెరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈపీఎఫ్‌వో సవివరంగా మార్గదర్శకాలు జారీచేయాల్సి ఉంది.

Videos

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)