amp pages | Sakshi

జాప్యంతో రూ. కోట్లు వృథా

Published on Thu, 07/24/2014 - 03:15

 మక్తల్ : ప్రభుత్వాల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం నత్తనడకన సాగుతుందని తద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ అన్నారు. ప్రాజెక్టుల కింద ముంపునకు గురైన ప్రాంతాల్లో నిర్వాసితులకు అన్నివసతులతో పునరావాసం కల్పించాలన్నారు.  బుధవారం ఆయన సంగం బండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో  ప్రభుత్వాలు నిర్లక్ష్యవైఖరి అవలంభిస్తున్నాయని, దశాబ్దాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగడం లేదన్నారు. జిల్లాలోనిసంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు శంఖుస్థాపన చేసి 19 ఏళ్లు గడచినా ప్పటికీ పూర్తి కాకపోవడం దారుణమన్నారు. దీని వల్ల   ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మూడురెట్లు పెరిగిందన్నారు. పాలమూరు జిల్లాలో నీటి వనరులు పుష్కలంగా ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారన్నారు. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం పూర్తరుుతే జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ఖరీఫ్ సీజన్‌లోనే రైతులకు సాగునీరు అందించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
 
 అక్రమాలపై విచారణ జరిపించాలి
 ముంపు గ్రామాల్లో అక్రమాలపై వెంటనే విచారణ జరిపించాలని  నారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేరడిగొమ్ము, భూత్పూర్ గ్రామాల్లో కొందరు అక్రమంగా షెడ్లు నిర్మించుకుని పరిహారం స్వాహా చేస్తున్నారన్నారు. ఇందులో అధికారులకు వాటా ఉందని ఆరోపించారు. నిజమైన లబ్దిదారులు ఏళ్లతరబడి పరిహారం అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. పునారవాస కేంద్రాల్లో కూడా రూ.3లక్షలతో డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. దీనిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనెఉన్నట్లు తెలిపారు.
 
 జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల పరిశీలన
 ధరూరు : సీపీఐ బృదం బుధవారం సాయంత్రం ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ రిజర్వాయర్‌ను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. నీటి నిల్వ, ఆయకట్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూరాల- పాకాలకు ఇచ్చే నీటి వివరాలను ఈఈ రవీందర్‌ను అడిగి తెలుసుకున్నారు.
 
 కొత్తగా నిర్మించనున్న ప్రాజెక్టు మార్గదర్శకాలు తమ వద్ద లేవని, లెఫ్ట్ కెనాల్ ప్రాంతం నుంచి నీళ్లు వదిలే ప్రాంతాన్ని  అధికారులు ఆయనకు చూపారు. అనంతరం నెట్టెంపాడు నెట్టెంపాడు ఎత్తిపోతల పనులను పరిశీలించారు. ప్రాజెక్టు కింద ఉన్న రిజర్వాయర్లు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు గద్వాలకు బయలుదేరి వెళ్లారు. ఈ బృందంలో సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లు వెంకటేష్, వర్ల పద్మ, విశ్వేరరావు, జిల్లా నాయకులు ఈర్ల నరసింహ, ఆంజనేయులు, కేశవులు తదితరులు న్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)