amp pages | Sakshi

'కాళేశ్వరం'లో పైప్‌లైన్లు

Published on Fri, 05/13/2016 - 02:17

* పిల్ల కాల్వల వ్యవస్థకు బదులుగా ఏర్పాటుకు సర్కారు నిర్ణయం
* భూసేకరణను తగ్గించడం, నీటి వృథాను అరికట్టడమే లక్ష్యం
* పైప్‌లైన్‌ వల్ల నిర్మాణ వ్యయం కూడా బాగా తగ్గే అవకాశం
* పైలట్‌ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21లో అమలు
* టీఎంసీ నీటిని కాల్వలతో 10 వేల ఎకరాలకు ఇవ్వొచ్చన్న అధికారులు
* పైప్‌లైన్‌తో అయితే అదేనీరు 20 వేల ఎకరాలకు సరిపోతుందని వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌
భూసేకరణ సమస్యను తప్పించడం, నీటి వృథాను అరికట్టడమే లక్ష్యంగా.. కాల్వలకు బదులు పైప్‌లైన్లతో సాగునీటిని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో పిల్ల కాల్వల వ్యవస్థ (డిస్ట్రిబ్యూటరీలు)ను పైప్‌లైన్ల ద్వారానే ఏర్పాటు చేయనుంది. కాల్వలతో పోలిస్తే పైప్‌లైన్‌ నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అవకాశంతోపాటు నీటి వృథా తగ్గే అవకాశమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ–21లో అమలు చేయనున్నారు. దీనికి సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఓకే చెప్పగా... పనులు మొదలు పెట్టేందుకు కాంట్రాక్టు సంస్థ సిద్ధమవుతోంది.

విస్తృత ప్రయోజనం: నిజానికి కాల్వల నిర్మాణానికి ఖర్చు ఎకరాకు రూ.25వేల వరకు ఉంటే... పైప్‌లైన్‌ వ్యవస్థకు రూ.23,500 వరకే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక కాల్వల ద్వారా ఒక టీఎంసీ నీటిని 10వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చే అవకాశం ఉండగా... పైప్‌లైన్‌తో 20వేల ఎకరాలకు అందజేయవచ్చని పేర్కొంటున్నారు. దీంతోపాటు పైప్‌లైన్‌ నిర్మాణానికి భూసేకరణ అవసరం తక్కువగా ఉంటుందని, అన్ని ప్రాంతాలకు సమానమైన నీటిని పంపిణీ చేసే అవకాశముంటుందని చెబుతున్నారు. నిర్వహణ ఖర్చు సైతం భారీగా తగ్గుతుంది. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఇప్పటికే ఇలా పైప్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తున్న ఓంకారేశ్వర డ్యామ్‌ను మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు ఇంజనీర్ల బృందం పరిశీలించి... ఈ విధానం అమలుకు ఓకే చెప్పింది. పాలమూరు, డిండి, కాళేశ్వరం ప్రాజెక్టుల పరిధిలో ఈ పైప్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో లక్ష్యంగా ఉన్న 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే... పిల్ల కాల్వల నిర్మాణానికే 1.5 లక్షల ఎకరాల భూమి అవసరం. దీనికి రూ.7,500కోట్ల దాకా ఖర్చవుతుంది. అదే పైప్‌లైన్‌ వ్యవస్థ ద్వారా అయితే రూ.6వేల కోట్లు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ ప్రయోజనాల దృష్ట్యానే పైప్‌లైన్‌ వ్యవస్థకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాళేశ్వరం ప్యాకేజీ–21లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. రూ.1,143 కోట్ల విలువైన ఈ ప్యాకేజీలో 1.70 లక్షల ఎకరాలకు నీరివ్వాల్సి ఉంది. సాధారణంగా పిల్ల కాల్వల నిర్మాణం కోసం ప్రతి లక్ష ఎకరాలకు 4 వేల ఎకరాల భూమి సేకరించాల్సి ఉంటుంది.

ఈ లెక్కన ప్యాకేజీ–21 కోసం సుమారు 7వేల ఎకరాలు అవసరం అవుతుంది. ప్రస్తుత లెక్కల ప్రకారం అక్కడ ఎకరానికి రూ.7లక్షల నుంచి రూ.8లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే కాల్వల కోసం భూసేకరణకే రూ.320కోట్లు అవసరం. అదే పైప్‌లైన్‌ వ్యవస్థ అయితే భూమిలో ఒకటిన్నర మీటర్ల కింద పైప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తారు. తద్వారా పైన యథావిధిగా వ్యవసాయం చేసుకునే అవకాశముంది. ఇక కాల్వల ద్వారా నీటి వృథా దాదాపు 30శాతం వరకు ఉండగా... పైప్‌లైన్‌తో వృథా అతి తక్కువ. దీంతోపాటు పైప్‌లైన్‌తో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. నిర్ణీత ఆయకట్టులో రెండో పంటకు సైతం నీరు అందించవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)