amp pages | Sakshi

పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు

Published on Mon, 05/11/2020 - 12:16

రాజేంద్రనగర్‌: బండ్లగూడ జాగీరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో తమ ఇళ్లల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహించారు. కూలర్లు, ఫ్రిడ్జీలు, కుండీలు, నీరు నిల్వ ఉన్న వాటిని గుర్తించి శుభ్రం చేశారు. బండ్లగూడ కార్పొరేషన్‌ మేయర్‌ మహేందర్‌గౌడ్, డిప్యూటీ మేయర్‌ రాజేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు శ్రీలతసురేష్‌గౌడ్, సాగర్‌గౌడ్, లతప్రేమ్‌గౌడ్, చంద్రశేఖర్, పద్మావతిపాపయ్యయాదవ్, శ్రవంతినరేందర్, ఆసియాఖాజా, సంతోషిరాజిరెడ్డి తదితరులు పరిశుభ్రత కార్యక్రమాలలో పాల్గొన్నారు. తమ ఇళ్లల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు తమతమ డివిజన్‌ల పరిధిలో ప్రజలందరు పాల్గొనేలా చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగీ, చికున్‌ గున్యా, మలేరియా తదితర విష జ్వరాలను దోమల ద్వారా వ్యాపించే అవకాశం ఉందన్నారు. వీటి నివారణ కోసం శుభ్రత ఎంతో అవసరమన్నారు. ఎక్కువగా నీళ్ల కులాయిలు, ప్లాస్టిక్‌ వ్యర్థాలలో నిలిచిన నీరు, కూలర్లు, ఫ్రిడ్జీలు తదితర వాటిల్లో వృద్ధి చెందుతాయన్నారు. వీటిని శుభ్రం చేయడం ద్వారా నియంత్రణ సాధ్యమన్నారు. అందుకే మంత్రి కేటీఆర్, రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ పిలుపునివ్వడంతో తామంతా పాల్గొన్నట్లు వెల్లడించారు. మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. 

నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి: శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి  
శంకర్‌పల్లి: వర్షకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల నివారణకోసం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌  ఇచ్చిన పిలుపు మేరకు శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్‌ ఇంటి శుభ్రతలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు మొదట ప్రజాప్రతినిధులు పరిసరాలను శుభ్రం చేసుకుంటే వారిని మరొకరు ఆదర్శంగా తీసుకొని పరిశుభ్రత పాటిస్తారని అన్నారు. ఇలాంటి కార్యక్రమం ద్వారా  ప్రతి ఒక్కరిలో మార్పు వచ్చి పరిసరాలను శుభ్రం చేసుకుంటారని  తెలిపారు. 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)