amp pages | Sakshi

పంచకూటాలయానికి మోక్షం

Published on Sun, 03/19/2017 - 03:14

నేడు మొదలు కానున్న పునర్నిర్మాణ పనులు
పనులు ప్రారంభించాలని ఆదేశించిన మంత్రి చందూలాల్‌


సాక్షి, హైదరాబాద్‌: అత్యంత అరుదైన పురాతన పంచకూటాలయానికి ఎట్టకేలకు మంచి రోజులొచ్చాయి. భూపాలపల్లి జిల్లా రామానుజాపూర్‌లో కాకతీయుల కాలం (13వ శతాబ్దం)లో నిర్మితమై శిథిలమైన పంచకూటాలయం పునర్నిర్మాణ పనులు ఆదివారం మొదలవుతున్నాయి. పురావస్తు శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి చందూలాల్‌ సొంత ప్రాంతంలో రాజకీయ విభేదాలతో అధికార పక్ష నేతలే దీని పునర్నిర్మాణాన్ని అడ్డుకున్నారు. దీంతో అత్యంత విలువైన శిల్పసంపద మట్టిలో కూరుకుపోయిన తీరును ‘సాక్షి’వెలుగులోకి తేవటంతో దాన్ని పునర్నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

కాకతీయుల నాటి అద్భుత కట్టడం..
వెంకటాపురం మండలంలోని రామానుజా పూర్‌ గ్రామ శివారులో 13వ శతాబ్దంలో కాకతీయులు అద్భుతంగా పంచకూటాలయం నిర్మించారు. ఒకే మండపంలో ఐదు విడివిడి ఆలయాలుంటాయి. ముస్లిం పాలకులు గతంలో ఈ ఆలయాన్ని కొంతమేర ధ్వంసం చేశారు. మిగిలిన ప్రాంతం కూడా సరిగా పట్టించుకోకపోవటంతో కాలక్రమంలో అది కూడా పడిపోయింది. రెండున్నర దశాబ్దాల కింద దాన్ని గ్రామానికి చేరువగా మరోచోట పునర్నిర్మించాలని పురావస్తుశాఖ నిర్ణయించిం ది. ఇంజనీరింగ్‌ నిపుణుల పర్యవేక్షణలో ఆలయ రాళ్లను జాగ్రత్తగా విడదీశారు. అయితే పనులు ప్రారంభం కాలేదు. మూడేళ్ల కింద రూ.కోటి అంచనాతో పనులు చేపట్టాలని నిర్ణయించగా కాంగ్రెస్‌ నేత ఒకరు తన అధీనంలో ఉన్న గ్రామకంఠం భూమి ఇచ్చేందుకు ముందుకొచ్చారు.

రూ.10లక్షలు వెచ్చించి స్థలాన్ని చదు ను చేసి పనులు మొదలుపెట్టే సమ యంలో అధికారపార్టీ నేతలు ఆ పనులు అడ్డు కున్నారు. కాంగ్రెస్‌ నేత స్థలంలో నిర్మిస్తే ఆయనకు పేరొస్తుందన్న ఉద్దేశంతో పాటు మంత్రికి ప్రాధాన్యమివ్వకుండా వ్యవహరిం చారని ఈ పనులు ఆపారు. ఇంతజరిగినా మంత్రి పట్టించుకోకపోవడంతో మొదలు కాలేదు. ఆలయం తాలూకు శిల్ప సంపద మట్టికొట్టుకుపోయింది. ఈ వివరాలను సచిత్రంగా ఇటీవల ‘సాక్షి’వెలుగులోకి తెచ్చింది. పురావస్తు శాఖను పర్యవేక్షించే మంత్రి ఇలాఖాలోనే ఈ దుస్థితి ఏర్పడటం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో సమీపంలోనే మరో స్థలాన్ని ఎంపిక చేయించి పునర్నిర్మాణ పనులు ప్రారంభించాలని మంత్రి నిర్ణయించారు.

Videos

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)