amp pages | Sakshi

‘ఐకియా’కు స్థలంపై హైకోర్టుకు రేవంత్‌

Published on Tue, 08/07/2018 - 02:04

సాక్షి, హైదరాబాద్‌: ఐకియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఫర్నిచర్‌ షోరూం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గ్‌ పన్మక్త గ్రామంలోని అత్యంత ఖరీదైన 16.27 ఎకరాల స్థలాన్ని ఐకియా ఇండియాకు ప్రభుత్వం ఏకపక్షంగా కేటాయించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. టెండర్లు ఆహ్వానించకుండానే కేటాయింపులు జరిపారని.. దీంతో ప్రభుత్వానికి రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రేవంత్‌ వెల్లడించారు. ఈ కేటాయింపులను నామినేషన్‌ పద్ధతిలో చేశారని.. ఇది చట్ట విరుద్ధమన్నారు. ఐకియా ఏర్పాటు చేస్తున్నది కేవలం ఫర్నిచర్‌ షాపు మాత్రమేనని, దీనికోసం మరో చోటైనా భూమిని కేటాయించవచ్చని వివరించారు. 

ఐటీ కంపెనీలకే కేటాయించాలి.. 
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇక్కడ ఐటీ కంపెనీలు, దాని ఆధారిత కంపెనీలకే  భూమి కేటాయించాల్సి ఉందని, అందుకు విరుద్ధంగా ఐకియాకు కేటాయింపులు జరిగాయని రేవంత్‌ పేర్కొన్నారు. ప్రస్తుత కేటాయింపుల ద్వారా రూ.33 కోట్లు మాత్రమే ఖజానాకు వచ్చినట్లు వెల్లడించారు. ఈ భూమిలో 3.17 ఎకరాలను ఒక్కో ఎకరా రూ.19.21 కోట్లకు ఐదేళ్ల తర్వాత కొనుగోలు చేసేలా ఐకియాకు రిజర్వు చేశారన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని.. వ్యాజ్యం తేలే వరకు ఆ భూమిలో కార్యకలాపాలు నిర్వహించకుండా ఐకియాను ఆదేశిం చాలని కోరారు. ఈ కేటాయింపులను చట్ట విరుద్ధంగా ప్రకటించి.. ఖజానాకు వాటిల్లిన నష్టాన్ని ఆ కంపెనీ నుంచి రాబట్టేలా ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.  

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)