టీడీపీపై ఈసీ సీరియస్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రముఖులకు ఈ జిల్లా అచ్చిరాదా!?
Published on Thu, 08/30/2018 - 13:25
చిట్యాల (నకిరేకల్) : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలువురు ప్రముఖులు రోడ్డు ప్రమాదాల బారిన పడ్డారు. ఈ ప్రమాదాల్లో కొందరు మృతిచెందగా.. పలువురు గాయాలతో బయటపడ్డారు.
2006లో చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పటి జిల్లా పరిషత్ చైర్మన్ దంపతులు వేమవరపు ప్రసన్న, రత్నాకర్లు మృతిచెందారు.-
2007లో సినీనటి ప్రత్యూష (దండోర ఫేమ్) కట్టంగూరు శివారులో కారు బోల్తా పడడంతో మృతి చెందింది. -
2014లో ఆకుపాముల వద్ద నందమూరి జానకీరామ్ ప్రయాణిస్తున్న కారు ట్రాక్టర్ను ఢీకొనడంతో ఆయన మృతి చెందారు. -
2014లోనే టీడీపీ నేత లాల్జాన్పాషా నార్కట్పల్లి శివారులోని కామినేని జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. -
2016లో సిమీ జాతీయ అధ్యక్షుడు మసూద్ ప్రయాణిస్తున్న కారు చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో డివైడర్ను ఢీకొట్టడంతో కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో మసూద్ అక్కడిక్కడే మృతిచెందాడు. -
2017లో నార్కట్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీ ఢీకొట్టడంలో చిట్యాలకు చెందిన టీఆర్ఎస్ జిల్లా నాయకుడు దుబ్బాక సతీశ్రెడ్డి మృతి చెందారు. -
2008లో రాష్ట్ర విద్యుత్ శాఖ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా.. చిట్యాల పట్టణ శివారులోకి రాగానే ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
2009లో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న సినీహీరో నాని చిట్యాల మండలం వెలిమినేడు ఆంజనేయస్వామి ఆలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. -
2009లో మోతె వద్ద జరిగిన ప్రమాదంలో హీరో జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల గాయపడ్డారు. -
2013లో నార్మాక్స్ చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. -
2015లో ప్రముఖ నేపథ్య గాయని శ్రావణభార్గవి హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో ప్రయాణిస్తుండగా చిట్యాల పట్టణ శివారులోకి రాగానే ఈమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రావణభార్గవి స్వల్ప గాయాలతో బయటపడింది. -
తాజాగా టీడీపీనేత, హీరో నందమూరి హరికృష్ణ అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
#
Tags