amp pages | Sakshi

విషాదాన్ని గుర్తు చేసుకుంటూ...

Published on Fri, 07/24/2015 - 23:39

♦ కన్నీటి సంద్రమైన మాసాయిపేట రైల్వే క్రాసింగ్
♦ రైలు దుర్ఘటనలో అసువులు బాసిన చిన్నారులకు నివాళి
♦ బరువెక్కిన హృదయాలతో తరలివచ్చిన మృతుల కుటుంబీకులు
 
 వెల్దుర్తి : సాయిపేట రైలు దుర్ఘఅభం..శుభం తెలియని 16 మంది చిన్నారులను బలిగొన్న మాటన జరిగి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం తూప్రాన్ మండలం వెంకటాయపల్లి, కిష్టాపూర్, గుండ్రెడిపల్లి, ఇస్లాం పూర్ గ్రామాలకు చెందిన మృతుల తల్లిదండ్రులు, బంధువులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున మాసాయిపేట రైల్వే క్రాసింగ్‌కు చేరుకున్నారు. ఘటనా స్థలంలో చిన్నారుల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్ద కన్నీటితో నివాళులర్పించారు. పిల్లల ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు.

చిన్నారుల చిత్రపటాలను చూస్తూ వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధువులు రోదనలతో అంతా చలించిపోయారు. మొదట గ్రామ సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీటీసీ సిద్దిరాంలుగౌడ్, మాజీ సర్పంచ్ నాగరాజు, ఉపసర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి, డీసీసీబీ డెరైక్టర్ నర్సింహులు, ఎమ్మార్పీఎస్‌జిల్లా ఇంచార్జ్ యాదగిరిలతో పాటు స్థానిక పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, యువకులు పాఠశాల నుంచి సంఘటన స్థలం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
 
 ఎక్కడికి వెళ్లావ్ నేస్తమా..
 రైలు దుర్ఘటనలో అసువులు బాసిన చిన్నారుల చిత్రపటాలను చూస్తూఎక్కడికి వెళ్లారు నేస్తమా.. అంటూ అదే ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారులు రుచిత, త్రిషా, నబీరా, వరుణ్‌గౌడ్‌లు కంటతడిపెట్టారు. రైలు దుర్ఘటన జరిగిన సంఘటనను గుర్తుకుచేసుకుంటూ కన్నీటి పర్వంతమయ్యారు. ఫొటోల వద్ద నివాళులర్పిస్తూ ఎప్పుడు వస్తారు నేస్తమా అంటూ రోదించారు
 
 ఆశలన్ని కూలిపాయే..  ఆనవాళ్లు దూరమాయే..
 రైలు దుర్ఘటనను గుర్తు చేసుకుంటూ ప్రమాదంలో గాయాలతో బయటపడినత్రిషా, నబీరా, రుచిత, వరుణ్‌గౌడ్‌తో పాటు  మాసాయిపేటకు చెందిన సాహితీ, సంకేత్ కంటతడి పెడుతూ... ఇప్పుడిప్పుడే విరబూస్తున్న రాలిపోయిన పూవుల్లరా.. ఆశలన్ని కూలిపాయే.. ఆనవాళ్లు దూరమాయే.. అంటూ ఆలపించిన పాట ప్రజలను కన్నీళ్లు పెట్టించింది.
 
 స్మృతి వనం ఏర్పాటు చేయాలి
  వెల్దుర్తి : మాసాయిపేట రైలు ప్రమాదంలో మృతి చెం దిన చిన్నారుల జ్ఞాపకార్థం వెంటనే రైల్వే క్రాసింగ్ వద్ద స్మృతి వనం ఏర్పాటు చేయాలని మృతుల బంధువులు, ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన సందర్భంగా గాయపడిన చిన్నారులతో పాటు మృతి చెందిన వారి తల్లిదండ్రులకు హెల్త్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చిన అధికారులు నేటికీ ఇవ్వలేదని ఆరోపించారు. చిన్నారుల మృతికి చిహ్నంగా సం ఘటన స్థలంలో స్మృతివనం ఏర్పాటు చేసి స్థూపం నిర్మిస్తామని ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల మాటలు నీటి మూటలుగానే మిగిలాయని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా నవతాదృక్పదంతో స్మృతి వనం ఏర్పాటు చేసి చిన్నారుల ఆత్మశాంతికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
 
 చేగుంటలో మానవహారం
  చేగుంట : మాసాయిపేట రైలు దుర్ఘటన జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా చేగుంటలో పలు విద్యా సంస్థలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు శుక్రవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. చేగుంట గాంధీ చౌరాస్తా వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, ఉపాధ్యాయులు, యువజన సంఘాల సభ్యులుపాల్గొన్నారు.

Videos

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)